Air India: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:55 PM
ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (AI-159)లో మంగళవారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన సర్వీసును రద్దు చేసారు. ఇదే మార్గంలో ఎయిరిండియా విమానం (AI-171) ఈనెల12న అహ్మదాబాద్లో ఘోర దుర్ఘటన జరిగి విమానంలోని 241తో సహా, విమానం కూలిన నివాస సముదాయంలోని మరో 33 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఇదే మార్గంలో లండన్కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్ విమానం కూడా ఇదే కావడం విశేషం.
కాగా, ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ఏఐ-171 నెంబర్ను ఏఐ-159గా, రిటర్న్ ఫ్లయిట్ నెంబర్ను ఏఐ-160గా మార్చారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి