Share News

BREAKING: ఏపీ పర్యటన.. మోదీ ఆసక్తికర ట్వీట్..

ABN , First Publish Date - Oct 16 , 2025 | 06:03 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: ఏపీ పర్యటన.. మోదీ ఆసక్తికర ట్వీట్..

Live News & Update

  • Oct 16, 2025 19:50 IST

    కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    • జయశంకర్‌ వర్సిటీకి 3 కొత్త వ్యవసాయ కాలేజీలకు కేబినెట్‌ ఆమోదం

    • నల్లగొండ, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు

  • Oct 16, 2025 19:49 IST

    ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది: Xలో ప్రధాని మోదీ

    • పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులు: Xలో మోదీ

    • ఏపీ కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం: మోదీ

    • శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నా: మోదీ

    • ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి.. విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రం కూడా

    • స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు..

    • భారత్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది: Xలో ప్రధాని మోదీ

  • Oct 16, 2025 19:49 IST

    తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు కేబినెట్‌ నిర్ణయం

    • డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు

    • నల్లగొండ, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు

    • R&B హ్యామ్‌ రోడ్లకు కేబినెట్‌ ఆమోదం

  • Oct 16, 2025 19:49 IST

    హైదరాబాద్‌: మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ

    • నటరాజన్‌కు నేను చెప్పాల్సింది చెప్పాను: మంత్రి సురేఖ

    • పార్టీ పెద్దలకు కూడా జరుగుతున్న విషయాలు చెప్పాను: మంత్రి సురేఖ

    • విచారణ జరిపి త్వరలో నిర్ణయం చెబుతామని పెద్దలు చెప్పారు: మంత్రి సురేఖ

    • పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కొండా సురేఖ

  • Oct 16, 2025 16:57 IST

    దసపల్లా హోటల్స్‌ కు గ్రీన్ సిగ్నల్..

    • ఏపీలో 4 స్టార్‌ దసపల్లా హోటల్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి

    • రూ.200 కోట్లతో 4 స్టార్‌ దసపల్లా హోటల్స్‌ నిర్మాణం

    • దసపల్లా హోటల్స్‌ నిర్మాణంతో 400 మందికి ఉపాధి అవకాశాలు

  • Oct 16, 2025 16:42 IST

    మంత్రులంతా రాజీనామా..

    • గుజరాత్‌ కేబినెట్‌లోని మంత్రులంతా రాజీనామా

    • కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న సీఎం భూపేంద్ర పటేల్‌

    • మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయనున్న సీఎం భూపేంద్ర

  • Oct 16, 2025 15:50 IST

    రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు

    • కర్నూలులో రూ.2,086 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులు

    • ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం

    • కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం

    • రూ.677 కోట్లతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులు

    • రూ.964 కోట్లతో సబ్బవరం-షీలానగర్‌ రోడ్డుకు ప్రారంభోత్సవం

    • రూ.1,142 కోట్లతో చేపట్టిన సిక్స్‌ లేన్‌ రోడ్డు ప్రాజెక్టులు

    • కృష్ణా జిల్లా నిమ్మకూరులో రూ.362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్‌

    • కర్నూలు నుంచి జాతీయ గ్రిడ్‌కు పునరుత్పాదక విద్యుత్ సరఫరా, అనుసంధానం

    • కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌

    • పెందుర్తి-సింహాచలం నార్త్‌ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి

  • Oct 16, 2025 15:12 IST

    MLA ప్రేమ్‌సాగర్‌కు చికిత్స..

    • హైదరాబాద్‌: గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో MLA ప్రేమ్‌సాగర్‌కు చికిత్స

    • ప్రేమ్‌సాగర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క

  • Oct 16, 2025 15:12 IST

    కొడంగల్ బంద్‌కు పిలుపు..

    • కొడంగల్ బంద్‌కు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కార్యాచరణ కమిటీ పిలుపు

    • వ్యాపారుల సంపూర్ణ మద్దతు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీ నిర్వహణ

    • అప్పాయిపల్లిలో తలపెట్టిన వైద్య కళాశాలను తరలించవద్దని డిమాండ్‌

  • Oct 16, 2025 15:00 IST

    సైబర్‌ నేరగాళ్ల టోకరా

    • ముంబై వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

    • డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట రూ.58 కోట్ల స్వాహా

  • Oct 16, 2025 14:59 IST

    హైదరాబాద్‌: ఓటు చోరీపై హైకోర్టులో BRS పిటిషన్‌

    • లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన BRS

    • BRS తరఫున న్యాయవాది దామా శేషాద్రి వాదనలు

    • జూబ్లీహిల్స్‌లో ఓటు చోరీ జరిగిందని వాదనలు

  • Oct 16, 2025 14:58 IST

    భద్రాద్రి: గుండెపోటుతో కండక్టర్ కన్నుమూత

    • దుమ్ముగూడెం మండలం ముల్కపాడులో ఘటన

    • భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్న RTC బస్సు

  • Oct 16, 2025 13:53 IST

    నవంబర్ 2 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన

    • రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా లండన్ లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

    • నవంబర్ 14,15 లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు

    • లండన్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్న సీఎం

    • విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరనున్న సీఎం

    • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్న సీఎం

    • సీఎంతో పాటు లండన్ వెళ్లనున్న సీఎం కార్యదర్శి కార్తికేయమిశ్ర

    • ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన జీఎడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

  • Oct 16, 2025 13:30 IST

    తెలంగాణ హైకోర్టులో కేటీఆర్, మాగంటి సునీత లంచ్‌ మోషన్ పిటిషన్

    • బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదని పిటిషన్

    • బోగస్ ఓట్లు డిలీట్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్

  • Oct 16, 2025 13:29 IST

    హైదరాబాద్: డెక్కన్ హోటల్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో విచారణ

    • పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న వెంకటేష్, రానా,..

    • అభిరామ్, సురేష్‌బాబు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం

  • Oct 16, 2025 13:29 IST

    మ.3గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం

    • బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీం తీర్పుపై చర్చించనున్న కేబినెట్

    • పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చ

  • Oct 16, 2025 13:15 IST

    మోదీ హామీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ కౌంటర్

    • వినియోగదారుల ప్రయోజనాల మేరకే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యత: భారత్‌

    • స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరాలు నిర్ధారించడమే మా లక్ష్యం: భారత్‌

    • భారత ఆర్థిక వ్యవస్థకు మా చమురు కీలకం: రష్యా

    • భారత్‌-అమెరికా సంబంధాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోం: భారత్‌

  • Oct 16, 2025 12:43 IST

    సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి దక్కని ఊరట

    • బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

    • పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలన్న ధర్మాసనం

    • తదుపరి విచారణ హైకోర్టులో కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు

  • Oct 16, 2025 12:34 IST

    ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు

    • రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయి: గోపాల్

    • కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టంగా ఉంది: గోపాల్

    • షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే 50% రిజర్వేషన్ల పరిమితి దాటింది

    • బీసీల కోసం 50శాతం పరిమితి దాటొచ్చనే తీర్పు లేదు: గోపాల్

    • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 50శాతం పరిమితి దాటకుండా..

    • ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం చెప్పింది: ప్రతివాదుల న్యాయవాది గోపాల్

  • Oct 16, 2025 12:27 IST

    శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ

    • శివాజీ దర్బార్ హాల్‌, ధ్యాన మందిరాలను తిలకించనున్న ప్రధాని

  • Oct 16, 2025 12:26 IST

    ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

    • తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు

    • తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరిన సింఘ్వీ

    • రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదు: సింఘ్వీ

    • ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉంది

    • దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో సర్వే జరిగింది

    • ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చింది: అభిషేక్ సింఘ్వీ

    • రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి

    • 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు: సింఘ్వీ

    • 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పింది

    • సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టే: అభిషేక్ సింఘ్వీ

  • Oct 16, 2025 12:05 IST

    ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్

    • జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ముందు విచారణ

    • తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు

  • Oct 16, 2025 12:04 IST

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడి

    • కల్తీ మద్యంపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన వైసీపీ నేతలు

    • మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై సోషల్ మీడియాలో..

    • ఫేక్ పోస్టులు పెట్టారంటూ విజయవాడ సీపీకి టీడీపీ నేతలు ఫిర్యాదు

    • వైసీపీ నేతల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • Oct 16, 2025 12:04 IST

    హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా స్వీట్ షాపులపై GHMC సిబ్బంది స్పెషల్ డ్రైవ్

    • నగరంలోని 43 స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

    • గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తింపు

    • షాపుల్లో అమ్మే వస్తువులకు లేబుల్‌, ఎక్స్‌పైరీ డేట్ లేదన్న అధికారులు

    • స్వీట్లలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారణ

    • నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు, భారీ పెనాల్టీలు విధింపు

  • Oct 16, 2025 12:04 IST

    డెక్కన్ సిమెంట్ వివాదంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందన

    • వివాదంపై స్పందించడానికి నిరాకరించిన మంత్రి ఉత్తమ్‌

    • వివాదంతో తనకి సంబంధం లేదన్న మంత్రి ఉత్తమ్

    • నేను జోక్యం చేసుకోలేదని కొండా సురేఖ కుమార్తే చెప్పింది కదా: ఉత్తమ్‌

  • Oct 16, 2025 12:03 IST

    రంగారెడ్డి: లింగంపల్లిలో ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ

    • ముందస్తు సమాచారంతో దాడి చేసి రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు

    • రేవ్ పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు గుర్తింపు

    • 2.40 లక్షల నగదు, 15 సెల్‌ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం

    • రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

  • Oct 16, 2025 12:03 IST

    మంత్రి కొండా సురేఖకు ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఫోన్‌

    • మీడియా ముందు మాట్లాడవద్దని సురేఖకు మీనాక్షి హితవు

    • మధ్యాహ్నం మీనాక్షి నటరాజన్‌ను కలవనున్న మంత్రి కొండా సురేఖ

  • Oct 16, 2025 12:02 IST

    మంత్రుల మధ్య వివాదం లేదు: ABNతో టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

    • ఓ కంపెనీకి సంబంధించిన అంశంలో కేసు ఫైల్ అయింది

    • ఆ కంపెనీపై సురేఖ ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఉంది

    • కంపెనీపై సీఎం విచారణకు ఆదేశించినట్టు తెలిసింది: ABNతో మహేష్‌గౌడ్

    • మీనాక్షి, సీఎం రేవంత్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం

    • కేబినెట్ నుంచి సురేఖను తీసే అంశం చర్చలో లేదు: మహేష్‌గౌడ్

  • Oct 16, 2025 11:08 IST

    ఎక్స్‌లో విరాట్ కోహ్లీ ఆసక్తికర పోస్ట్

    • విఫలమయ్యేది.. వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే

    • పోరాటం ఆపాలనుకుంటే.. ఓడిపోయినట్టే: విరాట్ కోహ్లీ

  • Oct 16, 2025 10:30 IST

    పెట్టుబడులపై ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్

    • ఆంధ్రా వంటకాలు స్పైసీగా ఉంటాయని అంటారు..

    • ఇప్పుడు ఏపీకి వచ్చే పెట్టుబడులూ స్పైసీగా ఉన్నాయి: లోకేష్‌

    • పొరుగువారికి అప్పుడే మంట మొదలైంది: ఎక్స్‌లో లోకేష్‌

  • Oct 16, 2025 10:12 IST

    చిత్తూరు: ములకలచెరువు మద్యం కేసు 10నిందితుల కస్టడీకి అనుమతి

    • 10 మంది నిందితులను కస్టడీకి అనుమతించిన తంబళ్లపల్లె కోర్టు

    • రేపటినుంచి 3 రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతి

    • 3 రోజుల కస్టడీకి సురేందర్ నాయుడును అనుమతి ఇచ్చిన కోర్టు

    • మిగిలిన 9 మందికి 2 రోజుల విచారణకు అనుమతించిన కోర్టు

    • మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులను రేపు కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

    • ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్‌లో నిందితులను ప్రశ్నించనున్న ఎక్సైజ్ పోలీసులు

  • Oct 16, 2025 10:09 IST

    ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌గాంధీ

    • ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు: రాహుల్‌గాంధీ

    • భారత్ నిర్ణయాలను ట్రంప్ ప్రభావితం చేస్తున్నారు: రాహుల్

    • రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తున్నట్టు మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యలు

  • Oct 16, 2025 09:26 IST

    ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన

    • కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం

    • రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌

    • రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్‌ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి

    • చిత్తూరు జిల్లాలో రూ.200 కోట్లతో ఇండేన్ గ్యాస్‌ ప్లాంట్‌

  • Oct 16, 2025 09:25 IST

    హైదరాబాద్: గండిపేట్ లో దారుణం కన్న తల్లిదండ్రుల పై దాడి చేసిన సైకో.

    • అర్ధరాత్రి తల్లిదండ్రుల పై కత్తి తో విచక్షణా రహితంగా పొడిచిన కొడుకు..

    • తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం.

    • తల్లి భారతి, తండ్రి రవీందర్ రెడ్డి. గండి పేట్ EIPL Apela అపార్ట్మెంట్ లో ఉంటున్న కుటుంబం.

    • నిందితుడు రఘుపాల్ రెడ్డి. ఓ లా కళాశాల లో ఎల్ఎల్బీ చదువుతున్న రఘుపాల్.

    • గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రఘు.

    • తన తల్లిదండ్రులు మానసికంగా వేదిస్తున్నారు,

    • నాకు మతి స్థిమితం సరిగ్గా లేదని, నాకు వైద్యం చేయించాలని చూస్తున్నారని దాడి చేసి నట్లు పోలీసులకు చెప్పిన సైకో.

    • నాకు ఏమి కాలేదు. నా తల్లిదండ్రులు కావాలనే నన్ను మానసికంగా వేదిస్తున్నారంటూ రెచ్చిపోయి తల్లిదండ్రుల కత్తి తో దాడి.

    • పోలీసుల అదుపులో నిందితుడు.

  • Oct 16, 2025 09:24 IST

    నెల్లూరు: అల్లూరు రోడ్డు వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం..

    • హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం..

    • ముందు వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం..

    • ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు..

    • ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఘటనా స్థలానికి చేరుకున్న దగదర్తి పోలీసులు.

  • Oct 16, 2025 09:15 IST

    నేడు మ.3గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

    • బీసీ రిజర్వేషన్లు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ,..

    • మెట్రో ఫేజ్-2 టెండర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం

    • కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరుపై ఉత్కంఠ

    • తన ఇంటికి పోలీసులు రావడంపై ఆగ్రహంగా ఉన్న సురేఖ

  • Oct 16, 2025 08:34 IST

    కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను ఖండించిన రోహిన్‌ రెడ్డి

    • ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: రోహిన్‌రెడ్డి

    • కొండా సురేఖ మాజీ OSD అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చేవారు

    • నాకు డెక్కన్ సిమెంట్స్ అంశాన్ని సుమంత్ చెప్పారు: రోహిన్‌రెడ్డి

    • నేను జోక్యం చేసుకోనని చెప్పి సుమంత్‌ను పంపేశా: రోహిన్‌రెడ్డి

  • Oct 16, 2025 08:26 IST

    తిరుపతి: మద్యం తాగి వాహనాలు నడిపిన 33 మందికి తిరుపతి కోర్టు జరిమానా

    • జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు కోర్టు జడ్జి సంధ్యారాణి తీర్పు

    • నిందితులు ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున జరిమానా విధింపు

  • Oct 16, 2025 08:09 IST

    హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ

    • విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్‌ తన సొంత నెంబర్‌కు బదులు..

    • మరో నెంబర్ ఇచ్చారని మెమో దాఖలు చేసిన సీబీఐ

    • బెయిల్ షరతులు ఉల్లంఘించినందుకు..

    • జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోర్టును కోరిన సీబీఐ

    • కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు లాయర్‌కు సీబీఐ కోర్టు ఆదేశం

    • మెమోపై నేడు విచారణ చేపట్టనున్న సీబీఐ కోర్టు

  • Oct 16, 2025 07:47 IST

    తిరుపతి: పాఠశాలకు మద్యం తాగి వచ్చిన 10th స్టూడెంట్

    • తొటి విద్యార్థులు ఉపాద్యాయులకు పిర్యాదు

    • తనిఖీలో స్కూల్ బ్యాగులో మద్యం బాటిళ్లు లభ్యం

    • విద్యార్థిని మందలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన హెడ్ మాస్టర్

    • తల్లిదండ్రులు వచ్చేలోపు పహారీ దూకి పారిపోయిన విద్యార్థి

    • విద్యార్థి కోసం వెతకగా రైలు పట్టాలపై మృతదేహం

    • చంద్రగిరి మండలం కొంగరవారిపల్లె దగ్గర ఘటన, చిత్తూరు రైల్వేపోలీసు దర్యాప్తు

  • Oct 16, 2025 07:46 IST

    రష్యా చమురు కొనుగోలు అంశంలో భారత్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • రష్యా చమురు కొనుగోలును త్వరలో ఆపేస్తున్నట్లు మోదీ హామీ ఇచ్చారు: ట్రంప్‌

    • ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరి చేయడంతో ఇదో కీలక అడుగు: ట్రంప్‌

    • అమెరికాకు భారత్ సన్నిహిత భాగస్వామి: ట్రంప్‌

    • ప్రధాని మోదీ నాకు స్నేహితుడు.. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది: ట్రంప్‌

    • ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని భారత్‌

  • Oct 16, 2025 07:46 IST

    భారత్‌, రష్యా చమురు కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌

    • రష్యా చమురు కొనుగోలు త్వరలో ఆసేస్తున్నట్లు మోదీ హామీ ఇచ్చారు: ట్రంప్‌

  • Oct 16, 2025 07:45 IST

    న్యూయార్క్‌: బ్రిక్స్‌ కూటమిపై మరోసారి ట్రంప్‌ అక్కసు

    • బ్రిక్స్‌ కూటమి అంటే అమెరికన్‌ డాలర్‌పై 'దాడి' అని అభివర్ణ

    • సుంకాల భయంతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి: ట్రంప్‌

  • Oct 16, 2025 07:00 IST

    పాకిస్థాన్‌- అఫ్గాన్‌ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

    • 40 మందికిపైగా తాలిబన్ల హతం

    • 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు

  • Oct 16, 2025 07:00 IST

    విజయవాడ: మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నేడు విచారణ

    • అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరిన మిథున్‌రెడ్డి

    • మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నేడు ACB కోర్టులో విచారణ

    • చెవిరెడ్డి పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ

    • ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతి కోరుతూ పిటిషన్‌

  • Oct 16, 2025 06:59 IST

    ఏపీ నకిలీ మద్యం కేసు నిందితుల కస్టడీపై నేడు విచారణ

    • జనార్దన్‌, జగన్‌మోహన్‌ను 10 రోజులు కస్టడీ కోరుతూ..

    • కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఎక్సైజ్‌ అధికారులు

    • ఎక్సైజ్‌ అధికారుల పిటిషన్‌పై విచారించనున్న కోర్టు

  • Oct 16, 2025 06:59 IST

    ముంబై: మాకు మరిన్ని ద్వైపాక్షిక విమాన హక్కులు ఇవ్వాలి: ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌

    • భారత్‌ అదనపు సర్వీసులు ఇవ్వకపోతే..

    • మా విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లిస్తాం: ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌

  • Oct 16, 2025 06:57 IST

    ఢిల్లీ: భారత్‌పై చైనా ఫిర్యాదు

    • ఈవీ, బ్యాటరీలకు రాయితీ ఇస్తోందని చైనా ఫిర్యాదు

  • Oct 16, 2025 06:57 IST

    ముంబై: వడ్డీ రేట్ల కోతలకు అవకాశం ఉంది: రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌

  • Oct 16, 2025 06:57 IST

    మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా

    • ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌ కోసం నివాసానికి వెళ్లిన పోలీసులు

    • పోలీసులతో కొండా సురేఖ కూతురు వాగ్వాదం

    • తమ కుటుంబంపై సీఎం రేవంత్‌, పొంగులేటి, వే నరేందర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు

    • రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని..

    • అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుష్మిత ఫైర్‌

    • డెక్కన్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను సుమంత్‌ రివాల్వర్‌తో బెదిరించారంటూ కేసు?

    • ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫిర్యాదుతో పోలీసుల చర్యలు

  • Oct 16, 2025 06:55 IST

    వెంకటేష్‌, శ్రీనివాస్‌ వ్యవహారంలో టీ.బీజేపీ సీరియస్‌

    • మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత, గోమాస శ్రీనివాస్‌కు..

    • షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన బీజేపీ క్రమశిక్షణ కమిటీ

    • రాంచందర్‌రావు మంచిర్యాల జిల్లా పర్యటనలో..

    • ఘర్షణ పడ్డ వెంకటేష్‌ నేత, గోమాస శ్రీనివాస్‌

    • మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ ఆదేశం

  • Oct 16, 2025 06:55 IST

    ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    • హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్

    • జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ముందు విచారణ

  • Oct 16, 2025 06:08 IST

    శ్రీశైలంలో ఆంక్షలు.. రాకపోకలు నిలుపుదల

    • ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

    • శ్రీశైలంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు

    • 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు

    • ప్రధాని పర్యటనతో శ్రీశైలంలో ఆంక్షలు.

    • ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు నిలుపుదల.

  • Oct 16, 2025 06:03 IST

    నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రాక

    • ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన

    • ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ప్రధాని

    • అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సుండిపెంట వెళ్లనున్న మోదీ

    • రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు

    • ఉదయం 11.15కు శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న ప్రధాని

    • మధ్యాహ్నం 12.10 శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం సందర్శన

    • అనంతరం సుండిపెంటకు చేరుకొని అక్కడ నుంచి.. హెలికాప్టర్‌లో నేరుగా నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ ఎలిప్యాడ్స్ వస్తారు

    • 2.30లకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని

    • మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని బహిరంగ సభ

    • సాయంత్రం 4.5కు కార్యక్రమం ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్న ప్రధాని నరేంద్ర మోదీ.