Share News

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

ABN , First Publish Date - Aug 21 , 2025 | 06:21 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Live News & Update

  • Aug 21, 2025 19:09 IST

    సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

    • కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్న సర్కార్.

    • కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు.

    • ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.

    • ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో.. భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.

  • Aug 21, 2025 17:55 IST

    అల్లూరి: విలీన మండలాలకు వరద ముప్పు.

    • ఉదృతంగా ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు.

    • కూనవరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన గోదావరి.

    • పోలిపాక వద్ద రహదారిపై చేరిన వరద నీరు.

    • కూనవరం- భద్రాచలం మధ్య నిలిచిపోయిన రాకపోకలు.

    • ఎటపాక మండలం నందిగామ ఇళ్ల సమీపంలోకి చేరిన వరద నీరు

    • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్తార్.

    • అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వాగుల వద్ద పోలీసుల పహార.

    • వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న చింతూరు ఐడిఏ పిఓ అపూర్వ భరత్.

    • డివిజన్లోని లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు.

  • Aug 21, 2025 16:47 IST

    ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

    • శ్రీశైలం, అనంతపురం, ఆముధాలవలస, గుంటూరు ఈస్ట్, తిరువూరు ఎమ్మెల్యేల పని తీరుపై లోకేష్ అసహనం.

    • ఇంచార్జి మంత్రులే మీ పరిధిలోని ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి: లోకేశ్‌

    • ఎన్డీయే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దు: మంత్రి లోకేశ్‌

  • Aug 21, 2025 15:50 IST

    ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

    • MLAలపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన సీఎం చంద్రబాబు.

    • అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సీఎం చంద్రబాబు.

    • మంత్రులే మీ MLAలను పిలిచి హెచ్చరించాలని చంద్రబాబు ఆదేశం.

    • మనం మంచి పనులు చేస్తున్నాము.. కొంతమంది చేస్తున్న పనుల వల్లే మనకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.

    • ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలి: సీఎం చంద్రబాబు

  • Aug 21, 2025 13:34 IST

    మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

    • ఏ-1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

    • రాజ్ కెసిరెడ్డి ఆస్తులను అటాచ్ చేయడానికి ఏఎస్పీ, సీఐడీ- ఐవోకు అనుమతి

    • ఎస్పీఈ, ఏసీబీ కేసులు ట్రైల్స్ నిర్వహించే మూడవ అదనపు జిల్లా సెషన్ జడ్జి ముందు.. అటాచ్ కోసం పిటిషన్ వేయాలని ఉత్తర్వుల్లో వెల్లడి

  • Aug 21, 2025 12:25 IST

    మరో ఇద్దరు మావోయిస్ట్‌ల లొంగుబాటు..

    • తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్ట్‌ల లొంగుబాటు..

    • రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి , చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను లొంగుబాటు

    • రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట మావోయిస్టులు లొంగుబాటు

    • కాకరాల సునీత అలియాస్ బద్రిపై కోటి రూపాయల రివార్డ్

  • Aug 21, 2025 11:38 IST

    ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి

    • ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి

    • నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరత్ పవర్, ప్రియాంక గాంధీ, ఎస్పీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, డీఎంకే నుంచి తిరుచి శివ

    • రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేసిన సుదర్శన్ రెడ్డి

  • Aug 21, 2025 09:37 IST

    గోదావరి జిల్లాలకు అలెర్ట్

    • పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    • భద్రాచలం వద్ద ప్రస్తుతం 50.8 అడుగుల నీటిమట్టం

    • ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 10.03 లక్షల క్యూసెక్కులు

    • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    • ప్రభావితం చూపే అల్లూరి, తూగో, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పగో జిల్లాలకు అలెర్ట్

    • గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

  • Aug 21, 2025 09:19 IST

    మియాపూర్‌లో దారుణం..

    • మక్త మహబూబ్ పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి....

    • పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

    • కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య

    • మృతుల్లో లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అల్లుడు అనిల్ (40), కవిత (38), అనిల్ కవిత దంపతుల కుమార్తె అప్పు (2) ఉన్నారు.

    • సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు.

  • Aug 21, 2025 08:45 IST

    చందానగర్ నాలాలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

    • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

    • మహిళ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు

    • మహిళ చేతికి నర్సమ్మ అనే పచ్చబొట్టు

    • పర్స్‌లో కమ్మలు, బ్రాస్లెట్ ఉన్నట్టు గుర్తింపు

    • పోస్ట్‌మార్టం నిమిత్తం మహిళా మృతదేహాన్ని గాంధీకి తరలింపు

  • Aug 21, 2025 08:32 IST

    నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

    • నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి.

    • ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, ఇండియా కూటమి ఎంపీలు.

  • Aug 21, 2025 08:28 IST

    తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

    • ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.  

    • సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది.  

    • 300 రూ శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతోంది. 

    • సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతోంది.  

    • నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,688  

    • నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,099  

    • స్వామి వారి నిన్న హుండీ ఆదాయం: ₹4.45 కోట్లు

  • Aug 21, 2025 07:09 IST

    గోదావరికి పెరిగిన వరద ఉధృతి

    • కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

    • ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద 16.45 మీటర్ల మేర ప్రవాహం

    • భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో తూర్పాక గ్రామం వద్ద కల్వర్టు నిర్మాణానికి వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం

    • చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆలుబాక గ్రామం వద్ద నిలిచిన రాకపోకలు

    • భద్రాచలం నుండి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్‌గడ్ వెళ్ళే జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

  • Aug 21, 2025 06:21 IST

    కృష్ణ నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలెర్ట్

    • విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

    • కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలెర్ట్, బందోబస్తు

    • ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల 64 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల

    • భవానీ దీపానికి రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన వేసిన అధికారులు