Share News

BREAKING: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై తండావాసుల దాడి

ABN , First Publish Date - Oct 11 , 2025 | 08:05 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై తండావాసుల దాడి

Live News & Update

  • Oct 11, 2025 18:06 IST

    ఢిల్లీ టెస్ట్‌: ముగిసిన రెండోరోజు ఆట

    • ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 140/4

    • 378 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ వెనుకంజలో వెస్టిండీస్‌

    • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 518/5 డిక్లేర్డ్‌

  • Oct 11, 2025 18:04 IST

    సంగారెడ్డి: నారాయణఖేడ్‌ మం. చల్లగిద్దా తండాలో పోలీసులపై దాడి

    • చల్లగిద్దా తండాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై తండావాసుల దాడి

    • పత్తినేనులో గంజాయి సాగుచేస్తున్నారన్న సమాచారంతో సోదాలు

    • 60 గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

    • పోలీసులపై తిరగబడిన తండావాసులు, వాగ్వాదం

    • టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఫోన్లు లాక్కున్న చల్లగిద్ద తండావాసులు

  • Oct 11, 2025 15:28 IST

    ఐసీసీసీలో ఏఐ హబ్, టీ స్క్వేర్‌పై సీఎం రేవంత్ సమీక్ష

    • హాజరైన శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్‌ జయేష్ రంజన్, అధికారులు

    • వీహబ్ ఐకానిక్ బిల్డింగ్‌గా ఉండాలి: సీఎం రేవంత్‌

    • వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి

    • పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: రేవంత్‌రెడ్డి

    • ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం..

    • ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో భవనాలను పరిశీలించాలి: రేవంత్‌రెడ్డి

    • ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్‌

  • Oct 11, 2025 15:28 IST

    విజయవాడ: తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం

    • పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత..

    • మీడియా సమావేశం నిర్వహించిన నూతన చైర్మన్‌ రాధాకృష్ణ

    • చైర్మన్‌తో సహా కొందరి సభ్యుల మీడియా సమావేశం

    • ప్రెస్‌మీట్‌ ఉందని.. నాకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ శినా నాయక్ ఆగ్రహం

    • చైర్మన్‌ కబురు పెట్టడంతో ఆలస్యంగా ప్రెస్‌మీట్‌కు ఈఓ శినా నాయక్‌

  • Oct 11, 2025 14:32 IST

    కల్వర్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి..

    • నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

    • కల్వర్టుని ఢీకొన్న కారు.. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి.

    • తల్లీ, ఇద్దరు చిన్నారులకి తీవ్రగాయాలు.

    • క్షతగాత్రులని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకి తరలింపు.

    • నెల్లూరు నుంచి బద్వేల్‌కి వెళ్తుండగా ఘటన.

  • Oct 11, 2025 14:18 IST

    మెదక్ జిల్లాలో దారుణం

    • మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో దారుణం ...

    • ఓ మహిళపై అత్యాచారం.. వివస్త్రను చేసిచెట్టుకు కట్టివేసిన దుండగులు

    • బాధితురాలు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 11, 2025 13:12 IST

    సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

    • తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక చర్చలు

    • జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న.. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్

    • సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వితో వీడియో కాన్ఫరెన్స్

    • హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చట్టపరమైన చర్యలపై చర్చ

    • జీవో 9 అమలుకై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

    • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పై ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం

  • Oct 11, 2025 12:31 IST

    ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్..

    • ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ

    • ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని

    • ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోదీ

    • హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు పయనం. అక్కడ నుంచి ఉదయం 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు.

    • ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం

    • మధ్యాహ్నం 1.40 గంటలకు సుండిపెంటలో హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయులుదేరనున్న ప్రధాని మోదీ

    • మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు

    • మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు.

    • సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

    • అనంతరం కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం.

  • Oct 11, 2025 11:11 IST

    తిరుపతిలో చిరుత కలకలం..

    • తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుతల కలకలం.

    • గత రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చిన చిరుత.

    • సీసీ కెమెరాలో రికార్డైన చిరుత సంచరిస్తున్న దృశ్యాలు

    • వెటర్నరీ, వేదిక్, ఎస్వీ యునివర్సిటీలో చిరుతలను పట్టేందుంకు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు

    • రాత్రిపూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన

    • విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని అధికారుల హెచ్చరిక.

  • Oct 11, 2025 10:39 IST

    మంత్రుల మధ్య.. టెండర్ల వార్..

    • మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌కు కొండా సురేఖ ఫిర్యాదు

    • మేడారం టెండర్లలో ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం

    • దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను..

    • తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు

    • పొంగులేటి తీరుపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి

    • తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యంపై ఆగ్రహం

    • పొంగులేటిపై సీఎం, అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ

  • Oct 11, 2025 09:47 IST

    నేడు తెలంగాణకు ఏఐసీసీ పరిశీలకులు

    • DCC అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పరిశీలకులుగా 22 మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు

    • వారం రోజుల పాటు జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన

    • హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనున్న ఏఐసీసీ పరిశీలకులు

  • Oct 11, 2025 09:34 IST

    రేపు విశాఖకు రానున్న మంత్రి నారా లోకేష్..

    • కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న లోకేష్

    • సిఫీ టెక్నాలజీస్‌కు ఓజోన్ వ్యాలీలో కేటాయించిన స్థలంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి

    • పీఎం పాలెంలో క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించనున్న మంత్రి లోకేష్

  • Oct 11, 2025 08:23 IST

    నేడు దేవలంపేటకు హోం మంత్రి అనిత..

    • అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను పరిశీలించనున్న అనిత.

    • 11 గంటలకు దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోనున్న అనిత.

    • అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్న హోం మంత్రి.

  • Oct 11, 2025 08:11 IST

    రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నలుగురికి గాయాలు..

    • వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్ పూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం

    • పరిగి - షాద్‌నగర్ ప్రధాన రహదారిపై బొలేరో వాహనం జాయింట్ రాడ్ విరగడంతో అదుపు తప్పి బోల్తా...

    • వాహనంలో ఉన్న కుమ్మరి రాజు (38) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి...

    • మరో ముగ్గురికి గాయాలు... పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • చిట్యాల నుండి రావులపల్లికి బొలేరో వాహనంలో ఫర్నీచర్ వస్తువులు తరలిస్తుండగా ఘటన.