Share News

BREAKING: టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్‌

ABN , First Publish Date - Sep 13 , 2025 | 07:16 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్‌

Live News & Update

  • Sep 13, 2025 18:56 IST

    నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

    • ఈనెల 23 నుంచి కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ దృష్ట్యా మంత్రి సమీక్ష

    • సమీక్షలో పాల్గొన్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌

    • తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం: ఉత్తమ్‌

    • 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71 శాతం డిమాండ్‌ చేస్తున్నాం: ఉత్తమ్‌

    • న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం: ఉత్తమ్‌

    • ట్రైబ్యునల్‌ ముందు బలమైన వాదనలు వినిపిస్తాం: మంత్రి ఉత్తమ్‌

    • తాగు, సాగునీటితో సహా పరిశ్రమల నీటి వినియోగానికి చర్యలు: ఉత్తమ్‌

    • ట్రైబ్యునల్‌ విచారణ సమయంలో సీఎం ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారు: ఉత్తమ్‌

  • Sep 13, 2025 18:56 IST

    జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నేను పోటీలో ఉన్నాను: మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌

    • నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్‌ యాదవ్‌

    • నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి: అంజన్‌కుమార్‌ యాదవ్‌

    • ఉమ్మడి ఏపీ నుంచి యాదవ సామాజికవర్గానికి మంత్రి పదవి కేటాయించారు: అంజన్‌కుమార్‌ యాదవ్‌

    • నాకన్న సీనియర్లు ఎవరు లేరు...నాకు అన్ని అర్హతలు ఉన్నాయి: అంజన్‌కుమార్‌ యాదవ్‌

    • హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం లేదు.. నాకు అవకాశం ఇవ్వాలి: అంజన్‌కుమార్‌

    • అనిల్‌కుమార్‌ యాదవ్‌కు యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీ ఇచ్చారు: అంజన్ కుమార్

  • Sep 13, 2025 18:56 IST

    వరంగల్ కాంగ్రెస్‌లో ముదురుతున్న మాటల యుద్ధం

    • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

    • నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: కొండా సురేఖ

    • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అదృష్టం కొద్ది గెలించారు: కొండా సురేఖ

    • నాయినిపై నేను కామెంట్ చేయాలని అనుకోవడం లేదు: కొండా సురేఖ

    • మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?: మంత్రి కొండా సురేఖ

    • అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశా: కొండా సురేఖ

  • Sep 13, 2025 15:59 IST

    ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 14 జిల్లాలకు కొత్త బాస్‌లు..

    ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తి.

    14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.

    7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు.

    మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ.

    12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించిన ప్రభుత్వం.

    కొత్త ఎస్పీలు వీరే..

    1. బిఆర్ అంబేద్కర్ కోనసీమ - రాహుల్ మీనా

    2. బాపట్ల- ఉమామహేశ్వర్

    3. నెల్లూరు – అజితా వేజెండ్ల

    4. తిరుపతి – సుబ్బారాయుడు

    5. అన్నమయ్య – ధీరజ్ కునుగిలి.

    6. కడప – నచికేత్

    7. నంద్యాల్ – సునీల్ షెరాన్

    పైన పేర్కొన్న ఈ ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారుల నియామకం

    9. విజయనగరం- ఎఆర్ దామోదర్

    10. కృష్ణా – విద్యాసాగర్ నాయుడు

    11. గుంటూరు – వకుల్ జిందాల్

    12. పల్నాడు – డి కృష్ణారావు

    13. ప్రకాశం– హర్షవర్థన్ రాజు

    14. చిత్తూరు – తుషార్ డూడి

    15. శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్.

    పైన పేర్కొన్న ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులను బదిలీ చేశారు.

    కాగా, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా ఉన్నారు.

  • Sep 13, 2025 15:16 IST

    వైసీపీ కార్యకర్తకు కూడా మంత్రి లోకేష్ సాయం

    • ఆపదలో ఉన్నా.. CMRFతో సాయమందించాలంటూ పోస్ట్.

    • వైసీపీ కార్యకర్త పోస్ట్‌కు సానుకూలంగా స్పందించిన లోకేష్.

    • జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ పేరుతో నారా లోకేష్‌కు ట్వీట్.

    • CMRFతో కావాల్సిన సాయం తప్పక చేస్తానని లోకేష్‌ హామీ.

    • సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.

  • Sep 13, 2025 15:00 IST

    విజయనగరం: రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం చేస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్

    • పెట్టుబడిదారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటోంది: రామ్మోహన్

    • ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే.. వైసీపీ అడ్డుపడుతోంది

    • నిర్మాణం పూర్తికాని మెడికల్ కాలేజీల కోసం మాత్రమే..

    • పీపీపీ మోడ్‌లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం: కేంద్రమంత్రి రామ్మోహన్

  • Sep 13, 2025 14:11 IST

    శంషాబాద్‌లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

    • ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించిన హైడ్రా

    • 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా హైడ్రా బోర్డు

    • ప్రభుత్వ భూమి విలువ రూ. 500 కోట్ల ఉంటుందన్న హైడ్రా

  • Sep 13, 2025 13:03 IST

    జగన్‌.. చేతనైతే టెండర్లు తీసుకుని డెవలప్ చేయ్..: మంత్రి పెమ్మసాని

    • గుంటూరు, రాజధాని ప్రజలు తెలివైనవాళ్లు: కేంద్రమంత్రి పెమ్మసాని

    • ఎవరికి అధికారం ఇవ్వాలో రాజధాని ప్రజలకు తెలుసు.

    • మా హయాంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి.

    • జగన్‌ ఏదో కష్టపడి సాధించినట్టు మాట్లాడడం విడ్డూరం.

    • వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కి రోడ్డు కూడా వేయలేదు.

    • జగన్‌కు చేతనైతే మెడికల్ కాలేజీ టెండర్లు తీసుకుని..ఆయనే అభివృద్ధి చేయాలి.

  • Sep 13, 2025 09:52 IST

    శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

    • ఈ ఏడాదిలో 5వ సారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తివేత

    • జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

    • ఇన్ ఫ్లో : 2,26,192 క్యూసెక్కులు

    • ఔట్ ఫ్లో : 1,49,104 క్యూసెక్కులు

    • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

    • ప్రస్తుతం : 883.90 అడుగులు

    • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

    • ప్రస్తుతం : 209.1579 టీఎంసీలు

    • కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Sep 13, 2025 08:50 IST

    మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు లొంగుబాటు

    • మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

    • మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్న సుజాతక్క

    • గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన

    • 1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్న సుజాతక్క

    • మొత్తం 106 కేసుల్లో నిందితురాలు సుజాతక్క

    • మధ్యాహ్నం 12 గంటలకు DGP ఎదుట లొంగుబాటు

  • Sep 13, 2025 08:36 IST

    మూసీలో పెరిగిన వరద ఉదృతి

    • జంట జలాశయాల నుండి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు.

    • జంట జలాశయాల వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి.

    • ముసరాంబాగ్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న మూసీ వరద.

    • ముసరాంబాగ్ బ్రిడ్జిపై నుండి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు.

    • 8200 క్యూసెక్యూల వరద ప్రవాహంతో ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి.

    • బ్రిడ్జికి ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించని అధికారులు..

    • గడిచిన నెల రోజుల్లో నాలుగో సారి బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న మూసి ప్రవాహం

  • Sep 13, 2025 07:19 IST

    గ్రూప్‌-2 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన

    • తెలంగాణలో గ్రూప్‌-2కు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన

    • నేటి నుంచి ఈనెల 15 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

    • నాంపల్లి తెలుగు వర్సిటీ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌