Share News

BREAKING: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం: ప్రధాని మోదీ

ABN , First Publish Date - Sep 21 , 2025 | 06:35 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం: ప్రధాని మోదీ

Live News & Update

  • Sep 21, 2025 20:50 IST

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

    • ఓయూ, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో వర్షం

    • నాచారం, మల్లాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం

  • Sep 21, 2025 17:26 IST

    దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది.. వారికి ఇది ప్రోత్సాహకరం

    • పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు: ప్రధాని మోదీ

    • హోటల్స్‌ సేవలపై కూడా జీఎస్టీ తగ్గించాం: ప్రధాని మోదీ

    • సంస్కరణలు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం: మోదీ

    • జీఎస్టీ తగ్గింపుతో MSMEలు కూడా లాభపడతాయి: మోదీ

    • దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయి: ప్రధాని మోదీ

    • ప్రజలు మేడిన్‌ ఇండియా ఉత్పత్తులే వాడాలి: ప్రధాని మోదీ

    • దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలి: మోదీ

  • Sep 21, 2025 17:26 IST

    వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి: ప్రధాని మోదీ

    • అన్ని వర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చాం: మోదీ

    • నిత్యావసరాల వస్తువులపై 5 శాతం మాత్రమే పన్ను: మోదీ

    • కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి: మోదీ

    • 12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులకు 5 శాతం పన్ను శ్లాబ్‌

    • ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు: మోదీ

    • మధ్య తరగతికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్‌ బోనాంజా: ప్రధాని మోదీ

  • Sep 21, 2025 17:26 IST

    జీఎస్టీ వచ్చాక అనేక రకాల పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం

    • జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది: మోదీ

    • జీఎస్టీ సంస్కరణలతో ప్రజల పొదుపు పెరుగుతుంది: మోదీ

    • జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలవారికి లాభం: ప్రధాని మోదీ

    • అనేక రకాల ట్యాక్స్‌లతో వ్యాపారులు కూడా ఇబ్బంది పడ్డారు

    • రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయి: మోదీ

    • అన్ని రకాల పన్నులను రద్దు చేసిన 2017లో జీఎస్టీ తీసుకువచ్చాం

    • జీఎస్టీ రాకముందు పన్నులు విధించి ఆటంకాలు కలిగించేవారు

  • Sep 21, 2025 17:06 IST

    ఢిల్లీ: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

    • రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్‌ ప్రారంభం: ప్రధాని మోదీ

    • జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు: మోదీ

    • జీఎస్టీ మార్పులతో రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయి

    • కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం

    • ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతమిస్తాయి: ప్రధాని మోదీ

    • సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ సంస్కరణలు సాయం చేస్తాయి

  • Sep 21, 2025 16:58 IST

    కర్నూలు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

    • మంత్రాలయం మం. బూదురులో సీటు రాక చదువుకు దూరమై...

    • పొలం పనులు చేస్తున్న మీనుగ జెస్సీకి మంత్రి లోకేష్‌ భరోసా

    • మంత్రి లోకేష్‌ ఆదేశాలతో ఆరోతరగతి చిన్నారి జెస్సీకి పాఠశాలలో సీటు

    • చిలకలడోన కస్తూర్భా స్కూల్‌లో సీటు కేటాయించిన కలెక్టర్‌, డీఈవో

  • Sep 21, 2025 16:58 IST

    సూర్యాపేట: ఆల్మట్టి డ్యామ్‌ పెంపునకు తెలంగాణ వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్‌

    • ఆల్మట్టి డ్యామ్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది: మంత్రి ఉత్తమ్‌

    • ఆల్మట్టి డ్యామ్‌ పెంపును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో వాదనలు వినిపిస్తాం

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోంది: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

    • తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తాం: ఉత్తమ్‌

    • కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాడుతాం: ఉత్తమ్‌

  • Sep 21, 2025 16:58 IST

    ఢిల్లీ: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

    • ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి GST 2.O

    • మోదీ ఏఏ అంశాలు ప్రస్తావిస్తారా అని స్వర్వత్రా ఉత్కంఠ

    • GST సంస్కరణలపై ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం

  • Sep 21, 2025 12:59 IST

    ఆరోగ్య కేంద్రం వద్ద బాధితుల ఆందోళన..

    • నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద బాధితుల ఆందోళన..

    • సీతారాంపురం మండలం బసినేనిపల్లి చెందిన మంజుల పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరిక.

    • మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు, హార్ట్ బీట్ తక్కువ ఉండడంతో బిడ్డ మృతి.

    • డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడంటూ మహిళ బంధువుల ఆందోళన.

    • వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో బిడ్డ చనిపోయారని మంజుల భర్త చంద్రశేఖర్, బంధువులు ఆరోపణ.

    • పోలీసులకు ఫిర్యాదు, విచారణ చేస్తున్న పోలీసులు

  • Sep 21, 2025 12:07 IST

    యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాగోతం

    • హనుమకొండ ధర్మసాగర్ మండలంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాగోతం

    • నకిలీ పత్రాలు సృష్టించి సొంత బ్యాంకులో బంగారు రుణాలు తీసుకున్న మేనేజర్ సురేష్

    • ధర్మసాగర్ మండలం ముప్పారం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఘటన

    • పది గోల్డ్ లోన్ అకౌంట్లు తెరిచి రూ. 74,92, 000 మంజూరు

    • బ్యాంక్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన అధికారులు

    • గోల్డ్ లాకర్ లో ఖాళీ గోల్డ్ పౌచ్‌లు గుర్తింపు

    • ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో మేనేజర్ సురేష్ పై ఉన్నతాధికారుల ఫిర్యాదు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 21, 2025 10:21 IST

    దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న బీజేపీ ‘సేవా పక్వాడ’

    • డ్రగ్స్ రహిత భారత్ కోసం నమో యువ రన్

    • రన్‌లో పాల్గొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు

    • ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా.. అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న బీజేపీ సేవా పక్వాడ

  • Sep 21, 2025 09:46 IST

    గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్

    • హైదరాబాద్ గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్.

    • సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేత.

    • భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు.

    • కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు.

    • స్థానికులకు హైడ్రాధికారులకు మధ్య వాగ్వాదం.

    • ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్ళను కూల్చి వేస్తున్నారంటూ బాధితుల ఆవేదన.

    • దేవేందర్ నగర్, బాలయ్య బస్తి, పోచమ్మ బస్తీలు వందలాది ఇళ్లు నేలమట్టం.

    • ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా.

  • Sep 21, 2025 09:05 IST

    క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

    • సికింద్రాబాద్‌లోని ఆవుల మంద ప్రాంతంలో ఉన్న క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో ముగిసిన ఐటీ సోదాలు

    • మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు

    • సికింద్రాబాద్ క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో లాప్టాప్స్, పెన్ డ్రైవ్లు స్వాధీనం

    • సికింద్రాబాద్ క్యాప్స్ గోల్డ్ కార్యాలయాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు

    • కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

  • Sep 21, 2025 08:40 IST

    రేపటి నుంచి ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు

    • రేపటి నుంచి రెండు రోజులపాటు ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు

    • ఏపీ సీఎంతో పాటు కేంద్ర‌, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు హాజరు

    • సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాటు చేస్తున్న జిల్లా యంత్రాంగం

  • Sep 21, 2025 08:16 IST

    నేటి నుంచి మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు

    • 2004 సెప్టెంబర్ 21 న మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం

    • 21 ఏళ్ల ప్రస్థానంలో ఆఖరి యుద్ధం చేస్తున్న మావోయిస్ట్ లు

    • ఆపరేషన్ కగార్ పంజా దెబ్బకు నేల రాలిన అగ్ర నేతలు

    • మే 21 న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్‌తో పెద్ద ఎదురు దెబ్బ

    • వరుస ఎన్ కౌంటర్లలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు కీలక రాష్ట్ర కమిటీ సభ్యులు హతం

    • పార్టీ ఆవిర్భావం నాడు 42 మంది కేంద్ర కమిటీ సభ్యులు ప్రస్తుతం అరెడుమంది మాత్రమే

    • మావోయిస్ట్ పార్టీలో నాయకత్వం కోసం విబేధాలు

    • మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాల తో ఛత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్

    • అడవి నీ జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు