Diabetes Diet Idli Dosa: డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినకూడదా?
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:07 AM
డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినడం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోసెలు చాలా ఫేమస్. ఇవి ఆరోగ్యకరమైన అల్పాహారాలు. వీటిని పులియబెట్టిన పిండితో తయారు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలోనూ ఎక్కువగా ఇడ్లీ, దోసె వంటి టిఫిన్లు చేసుకుని, వాటిని చట్నీ, సాంబార్తో ఇష్టంగా తింటారు. ఇడ్లీలు, దోశలు పులియబెట్టిన ఆహారాలు కాబట్టి, ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. బియ్యం, మినప్పప్పు నుండి ప్రోటీన్లు, బి విటమిన్లు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
ఇడ్లీలు తక్కువ కొవ్వుతో ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతాయి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా మంచివి. ముఖ్యంగా ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఇడ్లీ తినాలని వైద్యులు కూడా సూచిస్తారు. కానీ, చాలా మంది మధుమేహంతో బాధపడేవారు వీటిని తినడానికి వెనుకాడతారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇడ్లీ, దోసెలు తినకూడదని వారు అనుకుంటారు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇడ్లీ-దోస తినకూడదా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల ప్రకారం, డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఇడ్లీ, దోసెలు తినవచ్చు, కానీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తృణధాన్యాలు వాడండి:
సాధారణ బియ్యానికి బదులుగా జొన్న, రాగి, మిల్లెట్ వంటి తృణధాన్యాలను కలిపి ఇడ్లీ, దోసెలు చేసుకోవడం ద్వారా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెరను పెంచే రేటు) ను తగ్గించవచ్చు.
ఫైబర్ జోడించండి:
ఇడ్లీని సాంబార్ లేదా కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల ఆహారంలో ఫైబర్ శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మితంగా తినండి:
ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
పోర్షన్ కంట్రోల్:
ఒకేసారి ఎక్కువ ఇడ్లీలు, దోసెలు తినడం మానుకోండి. ఒక నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వైద్యుడిని సంప్రదించండి:
మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా కొత్త ఆహారం గురించి నిర్ణయం తీసుకునే ముందు మీ వైద్యుడిని లేదా డయాబెటిస్ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Also Read:
ట్రంప్తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మీటింగ్.. 80 నిమిషాలు ఏం మాట్లాడారు..
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా సహా
For More Latest News