Share News

Cyber ​​Fraud: ఆన్‌లైన్‌ లోన్‌ పేరుతో సైబర్‌ మోసం..

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:24 AM

ఆన్‌లైన్‌లో లోన్‌(Online Loan ) కోసం ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయురాలిని మభ్యపెట్టిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) ఆమె నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేశాడు. నగరానికి చెందిన ఉపాధ్యాయురాలు (57) ఆర్థిక అవసరాల నేపథ్యంలో లోన్‌ తీసుకోవాలని భావించింది.

Cyber ​​Fraud: ఆన్‌లైన్‌ లోన్‌ పేరుతో సైబర్‌ మోసం..

- ఉపాధ్యాయురాలి నుంచి రూ.5.50 లక్షల వసూలు

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌లో లోన్‌(Online Loan ) కోసం ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయురాలిని మభ్యపెట్టిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) ఆమె నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేశాడు. నగరానికి చెందిన ఉపాధ్యాయురాలు (57) ఆర్థిక అవసరాల నేపథ్యంలో లోన్‌ తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌(Online)లో రుణం ఇచ్చే సంస్థల కోసం వెతకగా ఓ ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధి మహేష్‌ పేరుతో సైబర్‌ నేరగాడు ఆమెను సంప్రదించాడు.

ఈ వార్తను కూడా చదవండి: Software employee: గంజాయి స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి


city7.2.jpg

ఆమె వివరాలు తీసుకుని లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో పలు దఫాలుగా రూ.5.50 లక్షలు తాను సూచించిన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా తిరిగి డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు(Cyber ​​Crime Police) ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో లోన్‌లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..

ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ

ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 28 , 2025 | 11:24 AM