Hyderabad: టాస్క్ల పేరుతో లూటీ.. రూ.14 లక్షలు గోవిందా
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:52 AM
టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్ ద్వారా నగరానికి చెందిన వ్యక్తి(43)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
- రూ.14 లక్షలు కాజేసి సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: టాస్క్లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్ ద్వారా నగరానికి చెందిన వ్యక్తి(43)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. గూగుల్(Google)లో రివ్యూ ఇస్తే రూ.40 ఇస్తామని చెప్పడంతో గ్రూపులో చేరాడు.
టాస్క్లు పూర్తి చేసినందుకు ముందుగా కొద్ది మొత్తాలు ఖాతాలో జమ చేశారు. తర్వాత అధిక మొత్తాలు ఆశచూపి క్రిప్టోలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. పెట్టుబడులకు భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లుగా నకిలీ వెబ్సైట్లో చూపారు.

వెబ్సైట్(Website)లో బై మోర్ ఆప్షన్ నొక్కడంతో మరింత పెట్టుబడులు పెట్టాలని, లేనిపక్షంలో ఖాతా ఫ్రీజ్ అవుతుందని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు ఇన్కంట్యాక్స్, జీఎస్టీ పేరుతో రూ.14.08 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో సైబర్ క్రైం పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News