అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 13 , 2025 | 02:01 PM
రైలు పట్టాలపై రాళ్లు పెట్టి రైళ్లు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన ఓ సాధువును పోలీసులు అరెస్టు చేశారు. సాధుకు రాళ్లు పెట్టినట్టు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు కాగా.. వాటి ఆధారంగా ఆ సాధువును గుర్తించి అరెస్టు చేశారు. ఆందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- పట్టాలపై రాళ్లు పెట్టిన సాధువు అరెస్టు
చెన్నై: అరక్కోణం, ఆవడి, తిరువలంగాడు ప్రాంతాల్లో పట్టాలపై రాళ్లు పెట్టి రైళ్లను కూల్చివేసేందుకు కుట్రపన్నాడనే ఆరోపణలపై ఉత్తరాదికి చెందిన సాధువును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల తిరువళ్లూరు జిల్లా తిరువలంగాడు, ఆవడి, అరకోణం ప్రాంతాల్లో రైలు పట్టాలపై రాళ్లు పెట్టి రైళ్లను కూల్చివేసే ప్రయత్నాలు జరిగాయి. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకుని పట్టాలపై రాళ్లు ఉంచిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: బైక్ నడిపి ప్రమాదానికి గురై బాలుడి మృతి
అదే సమయంలో సంఘటన ప్రాంతంలో సీసీ కెమెరాలలో నమోదైన వీడియో పరిశీలించినప్పుడు కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పట్టాలపై రాళ్లు పెడుతున్నట్లు గుర్తించారు.. ఆ వీడియో ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ వ్యక్తి ఉత్తరఖండ్ రాష్ట్రం హరిద్వార్ సమీపం హరిపూర్కాలనీ గంగానదీ ఒడ్డున నివసిస్తున్న సాధువుగా వెల్లడైంది. ముమ్మరంగా గాలించిఆ ఉత్తరాది సాధువును హైదరాబాద్లో అరెస్టు చేశారు. చెన్నైకి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచి ఆయనను జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News