Share News

Anam Ramanarayana Reddy: వైసీపీ చేసిన పాపాలను మోయాల్సి వస్తోంది.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:34 PM

సనాతన ధర్మం పాటిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Anam Ramanarayana Reddy: వైసీపీ చేసిన పాపాలను మోయాల్సి వస్తోంది.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
Anam Ramanarayana Reddy

కృష్ణా: తిరుమల పరకామణి అంశంపై శాసనమండలిలో వివరించామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఇవాళ (ఆదివారం) మంత్రి ఆనం పర్యటించారు. గ్రామంలోని తోటల శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముందుగా మంత్రికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వేద పండితులు, దేవాలయ అధికారులు పూర్ణకుంభముతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


సనాతన ధర్మం పాటిస్తూ.. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తిరుమలలో పరకామణి విషయంలో శాసనసభ స్పీకర్ సమయం ఇవ్వకపోవటం వల్ల మాట్లాడలేకపోయామని చెప్పుకొచ్చారు. శాసన మండలిలో పరకామణి విషయంలో వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. సందర్భానుసారంగా రాబోయే రోజుల్లో పరకామణి విషయంలో పూర్తి వివరాలు చెబుతామన్నారు. రాష్ట్రంలో 361 దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.


ఖాళీగా ఉన్న దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటించే కార్యక్రమం చేపడతామని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత, భగవాన్ నామస్మరణతో ప్రతి ఒక్కరు నిత్యం ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరి.. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ఉచిత అన్న ప్రసాదం అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. గత పాలకులు దేవాలయాల్లో చెప్పుకోలేని విధంగా తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో వైసీపీ పాలకులు చేసిన పాపాలను.. తామంతా మోస్తున్నామని వివరించారు. వారి పాపాలను కడిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. దేవాలయాల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?

Updated Date - Sep 28 , 2025 | 05:29 PM