Share News

Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

ABN , Publish Date - May 09 , 2025 | 12:54 PM

Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందాడు. మురళీనాయక్‌ మృతిపట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నివాళులర్పించారు.

Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
Operation Sindoor

అమరావతి, మే 9: భారత్ - పాక్ యుద్ధ భూమిలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (Telugu soldier Murali Nayak) వీరమరణం పొందాడు. రాష్ట్రానికి చెందిన తెలుగు జవాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. దేశ రక్షణలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆయన చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వ కారణమంటూ ఎక్స్‌ వేదికగా మురళీ నాయక్‌కు సీఎం, మంత్రి నివాళులర్పించారు.


చంద్రబాబు ట్వీట్

‘దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్‌కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


రాష్ట్రానికే గర్వకారణం: లోకేష్

lokesh-las.jpg

‘ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివదేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


కాగా.. భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ నేలకొరిగాడు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. నిన్న (గురువారం) రాత్రి యుద్ధ భూమిలో జవాన్ వీరమరణం పొందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీనాయక్ మృతదేహాన్ని రేపు (శనివారం) స్వస్థలానికి తీసుకురానున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పాకిస్తాన్ సైనిక పోస్టుల ధ్వంసం.. ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్..

Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2025 | 01:20 PM