NTPS: ఎన్టీపీఎస్లో భారీ ప్రమాదం.. ఒకరు మృతి
ABN , Publish Date - Mar 01 , 2025 | 08:44 PM
NTPS Accident: ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్టీపీఎస్లోఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరోకార్మికుడి పరిస్థితి సీరియస్గా ఉంది. ఈఘటనతో ఫ్యాక్టరీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం): ఎన్టీపీఎస్లో భారీ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందగా... ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. స్టేజ్ 5 డీఏం వాటర్ వాటర్ ప్లాంట్ టాంక్లో పెయింట్ వేస్తుండగా ఊపిరాడక కార్మికుడు చనిపోయాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. గాయపడ్డ కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లాలో ఫార్మసిటీలో కార్మికుడికి తీవ్ర అస్వస్థత
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలోని పరవాడలో గల జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఏక్టోరియా యూనిట్ 6 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎండీసీఐ ప్రెస్తో క్లాత్ క్లీన్ చేస్తుండగా వాయువుల పీల్చడంతో కాంట్రాక్ట్ కార్మికుడు అప్పలనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.కిమ్స్ హాస్పిటల్కి వైద్య నిమిత్తం తరలించారు.