Share News

Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేనిది.. మురళీనాయక్ ఫ్యామిలీకి సీఎం పరామర్శ..

ABN , Publish Date - May 09 , 2025 | 03:09 PM

Operation Sindoor: భారత్-పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మురళీ కుటుంబ సభ్యులతో ఫోన్‌‌లో మాట్లాడి పరామర్శించారు.

Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేనిది.. మురళీనాయక్ ఫ్యామిలీకి సీఎం పరామర్శ..
Operation Sindoor

అమరావతి, మే 9: భారత్ - పాకిస్థాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ (Jawan Murali Naik) కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఫోన్‌లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీరజవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని.. వారు ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.


మురళి త్యాగాన్ని జాతి మరువదు: పవన్

pawan-kalyan.jpg

ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి మరణించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారన్నారు. ఈ వీరుడి తల్లితండ్రులు జ్యోతి బాయి, శ్రీరామ్ నాయక్, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Vikram Doraiswami: పాక్ బండారం బయటపెట్టిన భారత్.. మొహం ఎక్కడ పెట్టుకుంటారో..


మంత్రి సవిత నివాళులు

savitha-minister.jpg

మరోవైపు వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జై జవాన్ జోహార్ మురళి నాయక్ అంటూ నినాదాలు చేశారు. వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి మంత్రి సవిత నివాళులర్పించారు.


దేశానికి గర్వకారణం: ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం: దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీ నాయక్‌ త్యాగాన్ని మరువలేమని.. ఆయన త్యాగం దేశానికే గర్వకారణమని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన యువకుడి మరణం ఈ దేశానికే తీరని లోటన్నారు. జవాన్ మురళి కుటుంబ సభ్యులకు ప్రణవ్ గోపాల్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2025 | 05:02 PM