Share News

AP Assembly: సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 08:11 AM

శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.

AP Assembly: సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..
Andhra Pradesh Legislative Assembly

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ (AP Assembly) 11వ రోజు (11th Day) బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే శాసన మండలి (Legislative Council) పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఆయా శాఖల బడ్జెట్ పద్దులపై ఉభయ సభల్లో చర్చ జరిగి ఆమోదం పొందనున్నాయి. 2024 ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.

Also Read..:

తిరుపతి జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు..


శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.

శాసన మండలిలో సామాజిక భద్రత ఫించన్లు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. పర్మిట్ రూములకు అనుమతి .. పీడీఎఫ్ బియ్యం అక్రమ అమ్మకం.. జగనన్న కాలనీల్లో అక్రమాలు.. నూతన పర్యాటక విధానం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. 2019- 2024 మధ్య జరిగిన కుంభకోణాలపై శాసన మండలిలో లఘు చర్చ జరగనుంది.


కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.25 లక్షల గృహాలు పూర్తి చేయగా, 7.25లక్షల ఇళ్లను 2026 మార్చికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 5లక్షల ఇళ్లను వచ్చే జూన్‌లోగా పూర్తి చేస్తాం. మిగిలినవి వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తాం’ అని తెలిపారు. 5,98,710 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల రూ.3,219.75కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యువత కాదు వృద్ధుల పోరు..

మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్..

For More AP News and Telugu News

Updated Date - Mar 13 , 2025 | 08:11 AM