AP BRAGCET 2025: ఏపీ బీఆర్ఏజీసీఈటీ ఫలితాల్లో టాప్ త్రీ వీళ్లే
ABN , Publish Date - May 09 , 2025 | 10:42 AM
AP BRAGCET 2025: ఏపీబీఆర్ఏజీసీఈటీ ఫలితాలను మంత్రి డోలా శ్రీ వీరాంజనేయస్వామి విడుదల చేశారు. ఐదవ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశ పరీక్షల ఫలితాల్లో మూడు జిల్లాల విద్యార్థుల టాప్ త్రీలో నిలిచారు.

అమరావతి, మే 9: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకాలల ప్రవేశ పరీక్ష (APBRAGCET - 2025) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఐదవ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం సాంఘీక సంక్షేమ శాఖ ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించింది. ఐదవ తరగతి ప్రవేశ పరీక్షల ఫలితాల్లో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు మొదటి, మూడో ర్యాంకు సాధించగా.. అనకాపల్లికి చెందిన విద్యార్థి రెండవ ర్యాంక్ సాధించారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షల్లో విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థి మొదటి ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు ర్యాంకులను సాధించారు.
ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. గురుకులాల్లో భవిష్యత్తులో సీట్లు పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యారులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు కాస్మోటిక్ కిట్స్ కూడా అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. గురుకులాల్లో మెకానైజ్డ్ సిస్టం ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. కార్పొరేట్కు ధీటుగా విద్యను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు కెరీర్ కౌన్సిలింగ్లు ఇప్పించి భవిష్యత్తుకు పునాదులు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు.
5వ తరగతి, ఇంటర్మీడియట్లో టాప్ త్రీ వీరే
5వ తరగతి ప్రవేశ పరీక్షలో..
మొదటి ర్యాంక్ - కడవల సుమతి (కర్నూలు జిల్లా)
రెండవ ర్యాంక్ - వియ్యపు శరత్ (అనకాపల్లి జిల్లా)
మూడవ ర్యాంక్ - బోయా విద్యా (కర్నూలు జిల్లా)
ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలో..
మొదటి ర్యాంక్ - రఘుపతి గీతిక (విశాఖ జిల్లా )
రెండవ ర్యాంక్ - ఈపూరు సుహృతి (కర్నూలు జిల్లా )
మూడవ ర్యాంక్ - పింజరి హసీనా (కర్నూలు జిల్లా)
ఇవి కూడా చదవండి
Operation Sindoor: పాకిస్తాన్ సైనిక పోస్టుల ధ్వంసం.. ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్..
Karachi Port Missile Strike: పాక్కు చావుదెబ్బ
Read Latest AP News And Telugu News