Share News

AP Liquor Case: మద్యం కుంభకోణం కేసులో.. 200 పేజీల రెండో ఛార్జ్ షీట్

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:33 PM

మరి కొద్దిసేపట్లో.. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయనోంది సిట్. 200 పేజీలతో రెండవ ఛార్జ్ షీట్‌ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు.

AP Liquor Case: మద్యం కుంభకోణం కేసులో.. 200 పేజీల రెండో ఛార్జ్ షీట్
AP Liquor Scam Case

అమరావతి: మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. మరి కొద్దిసేపట్లో.. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయనొంది సిట్. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్‌ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు. రెండవ ఛార్జ్ షీట్‌లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్‌ డేటా రికార్డు, గూగుల్ టేక్ అవుట్, ఇతర ల్యాప్‌టాప్‌లోని వివరాలను ఛార్జ్ షీట్‌లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు.


బిగ్‌బాస్ ఆదేశాల మేరకే మద్యం విధానం మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహార విషయంలో కూడా ఈ ముగ్గురి పాత్ర కీలకమని ఉందని సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్‌ను వైట్‌గా ఎలా మార్చాలి... అనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. మద్యం ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు.. ఎవరెవరికి చేరింది అనే అంశంపై కూడా వివరాలను సేకరించినట్లు తెలిపారు. విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్‌లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు.


లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుమార్లు ధనుంజయ్ రెడ్డి హజరు అయినట్టు గూగుల్ టేక్ అవుట్(Google Takeout) సాక్ష్యాలను సిట్ పొందుపరిచినట్లు సమాచారం. ఈ ముడుపులలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా కొంతవరకు సొమ్ములు వెనకేసుకున్నారని సిట్ వివరించింది.ఈ మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని.. దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు సిట్ చెప్పుకొచ్చింది. గత నెల జులై 19వ తేదీన 305 పేజీలతో తొలి ఛార్జ్ షీట్(Charge sheet) దాఖలు చేసినట్లు సిట్ గుర్తు చేసింది. మూడు ట్రంక్ పెట్టెల్లో ఛార్జ్ షీట్‌తో పాటు వివిధ డాక్యూమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, హార్డ్ డిస్కులను కూడా కోర్టుకు సమర్పించిన సిట్. మొదటి ఛార్జ్ షీట్‌(Charge sheet)లో రాజ్ కేసిరెడ్డి ద్వారా ముడుపులు మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డికి చేరాయని, అక్కడ నుంచి బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి సీఎం జగన్‌కు చేరాయని సిట్ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో జగన్‌ మేనమామ రాజకీయం

ఏపీలో తెలంగాణ మంత్రులు

Updated Date - Aug 11 , 2025 | 03:52 PM