Share News

Road Accident: లారీని ఢీకొట్టిన వ్యాన్.. నలుగురు మృతి..

ABN , Publish Date - Nov 23 , 2025 | 09:25 AM

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నులుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

Road Accident: లారీని ఢీకొట్టిన వ్యాన్.. నలుగురు మృతి..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నులుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. మృతులంతా వ్యాన్‌లో మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం వెళ్తు్న్నారు. ఎత్తురాల్లపాడు దగ్గరకి రాగానే వ్యా్న్.. లారీని ఢీకొట్టింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు బోరాసింగ్ పవర్, విజయ్ సింగ్ తోమర్, ఉషీర్ సింగ్, సంతోషిబాయ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్

ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 23 , 2025 | 09:25 AM