Share News

Tiruchanoor: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:19 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవల పూర్తయ్యాయి. ఇక తిరుచానూరులో కొలువు తీరిన శ్రీపద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభకానున్నాయో.. టీటీడీ వెల్లడించింది.

Tiruchanoor: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
Tiruchanoor Padmavathi Ammavari Brahmotsavams

తిరుపతి, అక్టోబర్ 14: తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవలను ఏ రోజున ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా వివరించింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.


వాహన సేవల వివరాలు :

  • 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం (ధనుర్ లగ్నం) ఉదయం, చిన్నశేషవాహనం ( రాత్రి).

  • 18-11-2025 (మంగళవారం) పెద్ద శేషవాహనం (ఉదయం), హంసవాహనం (రాత్రి).

  • 19-11-2025 (బుధవారం) ముత్యపు పందిరి వాహనం (ఉదయం), సింహవాహనం (రాత్రి)


  • 20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం (ఉదయం), హనుమంత వాహనం (రాత్రి)

  • 21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం (ఉదయం), గజవాహనం (రాత్రి)

  • 22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గరుడవాహనం (రాత్రి)


Updated Date - Oct 14 , 2025 | 12:25 PM