Share News

BJP: బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలపై రాతలు.. ముల్కనూర్‌లో ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:12 AM

Telangana: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో ఈరోజు (మంగళవారం) బండి సంజయ్ పాదయాత్ర జరుగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

BJP: బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలపై రాతలు.. ముల్కనూర్‌లో ఉద్రిక్తత

హనుమకొండ, ఫిబ్రవరి 27: బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) ప్రజాహిత యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో ఈరోజు (మంగళవారం) బండి సంజయ్ పాదయాత్ర జరుగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాహిత యాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోని ఎంపీ బండి సంజయ్ ఫోటోపై కాంగ్రెస్‌ కార్యకర్తలు పలు రాతలు రాశారు. ‘‘బండి సంజయ్ కాదు కాదురా వీడు సన్యాసి’’ అంటూ హస్తం నేతలు రాశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలుఅంబేద్కర్ కూడలికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 10:12 AM