Share News

LokSabha Elections 2024: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు..

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:44 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ .. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ నేతలు వరుస పర్యటనలు ఖారారైనాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు.

LokSabha Elections 2024: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు..

హైదరాబాద్, ఏప్రిల్ 27: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ .. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ నేతలు వరుస పర్యటనలు ఖారారైనాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు.


ఏప్రిల్ 29వ తేదీన జేపీ నడ్డా.. కొత్తగూడెం, మహబూబాబాద్‌‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. అలాగే అదే రోజు.. హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించ నున్నారు. ఇక ఏప్రిల్ 30వ తేదీన ఆందోల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.


ఇక మే 1వ తేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పాతబస్తీలోని ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.

Read National News And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 08:44 PM