Share News

Nitin Gadkari: దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉంది

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:14 PM

దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. గురువారం నాడు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో గడ్కారీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు.

Nitin Gadkari: దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉంది

నిజామాబాద్: దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. గురువారం నాడు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో గడ్కారీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సర్కారు ఆస్పత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని అన్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందని అన్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పారు. తెలంగాణలో సాగవుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. దేశంలో రూ.2 లక్షల కోట్లతో రోడ్లను ఎక్స్ ప్రెస్ హైవేలుగా నిర్మిస్తున్నామని చెప్పారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు టూరిజం అబివృద్ధికి దోహదపడుతాయని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని నితిన్ గడ్కరీ ధ్వజమెత్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 07:14 PM