Share News

Dharmapuri Arvind: మూడోసారి కాదు.. నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:22 PM

Andhrapradesh: మూడోసారి కాదు.. నాలుగో సారి కూడా మోదీనే ప్రధాని అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.

Dharmapuri Arvind: మూడోసారి కాదు.. నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని

హైదరాబాద్, మార్చి 12: మూడోసారి కాదు.. నాలుగో సారి కూడా మోదీనే (PM Modi) ప్రధాని అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Nizamabad MP Dharmapuri Arvind) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ (BJP) 12 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు లేరన్నారు. మోదీ చొరవతోనే నిజామాబాద్‌లో పసుపు ధర ఆల్ టైమ్ రికార్డ్‌గా నమోదవుతుందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక.. ముధురా దేవాలయంపై దృష్టి పెడతారని తెలిపారు. పోలింగ్ బూత్‌ను గెలిస్తే లోక్‌సభ సీటు గెలిచినట్లే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

Viral News: పిల్లల్ని కనండి.. డబ్బు పొందండి.. వింత ఆఫర్ పై రగులుతున్న వివాదం..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 12 , 2024 | 04:22 PM