Share News

Sridhar Babu: అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 04 , 2024 | 07:04 PM

అదానీ గ్రూప్ ( Adani Group ) పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని.. పెట్టుబడులు పెట్టేవాళ్లకి వెల్కమ్ చెబుతున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

Sridhar Babu: అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అదానీ గ్రూప్ ( Adani Group ) పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని.. పెట్టుబడులు పెట్టేవాళ్లకి వెల్కమ్ చెబుతున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో అదానీ గ్రూప్ కలిసివస్తామని చెప్పారు. అదానీ గ్రూప్ వాళ్ల పెట్టుబడులు ఎవరికి తెలియకుండా చేసిందేమీ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా పారదర్శకమేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 08:08 PM