Share News

TS Politics: పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన

ABN , Publish Date - Feb 01 , 2024 | 06:53 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

TS Politics: పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన

హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచనలు, సలహాలు ఇచ్చారు.

టైమ్ ఇద్దాం.. కాస్త ఓపిక!

ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరు అదైర్యపడొద్దు. అందరూ దైర్యంగా ఉండండి. ప్రతిపక్షంలో ఉండటం తప్పేమీ కాదు. కాంగ్రెస్ నేతల ట్రాప్‌లో ఎమ్మెల్యేలెవరూ పడొద్దు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రిని కలిసినా మీ వ్యక్తిత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి. మనకు తొందరలేదు కాంగ్రెస్‌కు తగిన సమయం ఇద్దాం. మనం పెద్దగా తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు.. వాళ్లే దిగిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు సిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్‌ఎస్‌కు దక్కుతుంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ సూచించారు.

ఆ విషయంపై పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టాలి

కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న కేంద్రం ప్రతిపాదనలపై కేసీఆర్.. ఎంపీలతో చర్చించారు. ఈ విషయంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేపట్టాలని కేసీఆర్ సూచించారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి పార్టీ తరపున నిరసన తెలియజేసి, వినతి ఇవ్వాలని ఎంపీలకు చెప్పారు. రేపు(శుక్రవారం) పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆందోళనకు ఎంపీలు సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు.

Updated Date - Feb 01 , 2024 | 07:13 PM