KP Vivekanand: ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది
ABN , Publish Date - Mar 06 , 2024 | 07:58 PM
కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్పై అధికారంలో లేనప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekanand ) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం కళ్లు తెరిచేలా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్పై అధికారంలో లేనప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekanand ) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం కళ్లు తెరిచేలా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్న ప్రభుత్వం మ్యారేజ్ రెగ్యులేజేషన్ స్కీమ్ కూడా తీసుకు వస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల సంగతేంటని నిలదీశారు. తమకు ధర్నాలు చేయాలనే తొందరేమీ లేదన్నారు. ప్రభుత్వమే తాము ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకు వచ్చిందని అన్నారు. రేవంత్ తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీ ఆశీర్వాదం కావాలంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సమయం వచ్చినప్పుడు ప్రజల్లోకి వస్తారని అన్నారు. ఆయన వస్తే రేవంత్ కుర్చీలోంచి ఎగిరిపోతారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలుపై వంద రోజుల తర్వాత శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం కోసం సీఎం రేవంత్ ప్రధాని మోదీ సహకారం అడుగుతున్నారని వివేకానంద ఎద్దేవా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి