TS NEWS: సాహిల్ యాక్సిడెంట్ కేసుపై కొనసాగుతున్న దర్యాప్తు
ABN , Publish Date - Jan 07 , 2024 | 04:19 PM
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ( Sahil ) చేసిన యాక్సిడెంట్ కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి సాహిల్ ఇతర దేశాలకు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందడంతో తండ్రి షకీల్ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నమోదైన ఎఫైఐర్లో మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరును కూడా పోలీసులు యాడ్ చేసి విచారణలో వేగం పెంచారు.
![TS NEWS: సాహిల్ యాక్సిడెంట్ కేసుపై కొనసాగుతున్న దర్యాప్తు](https://media.andhrajyothy.com/media/2023/20231205/1shakeel_1436e94ee9.jpg)
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ( Sahil ) చేసిన యాక్సిడెంట్ కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి సాహిల్ ఇతర దేశాలకు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందడంతో తండ్రి షకీల్ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నమోదైన ఎఫైఐర్లో మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరును కూడా పోలీసులు యాడ్ చేసి విచారణలో వేగం పెంచారు. యాక్సిడెంట్ చేసి అదే రోజు దుబాయ్కి మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సాహిల్ పారిపోయినట్లు సమాచారం. సాహిల్పై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. సాహిల్ విదేశాల నుంచి ఇండియాలో ఏ ఎయిర్పోర్టులో దిగినా వెంటనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం వస్తుందని హెచ్చరించారు.