Home » Police
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు.
Andhrapradesh: మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు.
తుపాకులు విక్రయించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల(Cyberabad SOT Police) వలకు చిక్కాడు. ఇతని నుంచి కంట్రిమేడ్ పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మీ ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న డిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వైసీపీ నాయకుడు నగేష్పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ...
సీఐ రాజశేఖర్రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది.