Home » Police
నాంపల్లి రైల్వే స్టేషన్లో దొంగలు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరుసటి రోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులపై రౌడీ మూకలు కత్తులు, హాకీ కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జిల్లాకు కేవీ మురళీకృష్ణను నియమించారు. అనకాపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ...
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్నర్ మత్తులో ఉన్న యువకులు గొడ్డలి, రాళ్లతో పోలీసులపై దాడి చేయగా ఆత్మరక్షణ కోసం వారు కాల్పులు జరిపారు.
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.
నాంపల్లిలో కాల్పుల కలకలం రేగుతోంది. రైల్వేస్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.
కాలం మారింది. మనుషులు కూడా ఛేంజ్ అయ్యారు. ఒకప్పటిలా పరిస్థితులు లేవు. పని అంత కన్నా లేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువే. భార్య భర్తల మధ్య సంబంధాలు కూడా బాగో లేవు. ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు. పై నాలుగు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు.
ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు. వారిలో కొందరు చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయి. కొందరు మాత్రం చదువుకుంటారు. సొసైటీలో గౌరవంగా బతుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారు మన్వి మధు కశ్యప్. ఈమె ఇటీవల సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు ఎంపికైంది.
సైబారాబాద్ మాజీ (రిటైర్డ్) పోలీస్ కమిషనర్ ప్రభాకర్రెడ్డి, మరో ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి 57.12 ఎకరాల భూమిని రూ.22.23 కోట్లకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు ఓ కేటుగాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అందోలులో వెలుగుచూసింది.