Share News

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ఎంఎంటీఎస్‌లు రద్దు..

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:42 AM

ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను(MMTS Trains) రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులపై(Indian Railways) ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రద్దుకు సంబంధించి కనీసం ఒక రోజు ముందు వివిధ రకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ఎంఎంటీఎస్‌లు రద్దు..
Hyderabad MMTS trains

• చివరి నిమిషంలో ప్రకటనపై ఆగ్రహం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను(MMTS Trains) రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులపై(Indian Railways) ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రద్దుకు సంబంధించి కనీసం ఒక రోజు ముందు వివిధ రకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గురువారం రాత్రి 7.40 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు వివిధ మార్గాల్లో తిరిగే ఎంఎంటీఎస్‌లు రద్దయినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషనల్‌ కారణాలతో రద్దు చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, లింగపల్లి–ఉమ్డానగర్‌ మార్గాల్లో ఒక్కో ఎంఎంటీఎస్‌ను రద్దు చేయగా, లింగంపల్లి–సికింద్రాబాద్‌ మార్గంలో ఏకంగా మూడు ఎంఎంటీఎస్‌లు రద్దయ్యాయి. అధికారుల అలక్ష్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 08:42 AM