Share News

TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి.. పూర్తి టీం ఇదే..

ABN , Publish Date - Jan 25 , 2024 | 03:48 PM

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్ గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు.

TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి.. పూర్తి టీం ఇదే..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆయనతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై. రామ్మోహన్ రావులు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులూ రాజీనామా చేశారు.

సభ్యుల నియామకాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన సర్కార్.. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సభ్యుల నియాకం కూడా పూర్తి కావడంతో త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవాకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 25 , 2024 | 04:04 PM