Share News

TS NEWS: హైదరాబాద్‌లో వివాదంగా అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:30 PM

నగరంలోని నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ( Delhi Public School ) ఈనెల 6వ తేదీన అయోధ్య రాముడి ( Ayodhya Rama ) అక్షింతల పంపిణీ కార్యక్రమానికి తలపించారు. అయితే పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని పీ.డీ‌.ఎస్.యూ ( PDSU ) వ్యతిరేకిస్తోంది.

TS NEWS: హైదరాబాద్‌లో వివాదంగా అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ

హైదరాబాద్: నగరంలోని నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ( Delhi Public School ) ఈనెల 6వ తేదీన అయోధ్య రాముడి ( Ayodhya Rama ) అక్షింతల పంపిణీ కార్యక్రమానికి తలపించారు. అయితే పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని పీ.డీ‌.ఎస్.యూ ( PDSU ) వ్యతిరేకిస్తోంది. మల్కా కొమురయ్య ఆధ్వర్యంలో అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరవుతున్నారు. మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని పీ.డీ‌.ఎస్.యూ డిమాండ్ చేసింది. పీ.డీ‌.ఎస్.యూ వ్యవహార శైలిని హిందుత్వ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Updated Date - Jan 05 , 2024 | 08:30 PM