Share News

Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

ABN , Publish Date - Apr 11 , 2024 | 09:16 AM

భారత్‌ రైస్‌(Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)(NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..

Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..
Bharat Rice in Hyderabad

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): భారత్‌ రైస్‌(Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)(NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్‌ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్‌ రైస్‌ విక్రయాలు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్లు నాఫెడ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


ప్రచారం లేక..

ప్రచారం లేకపోవడంతో భారత్‌ రైస్‌ అమ్మకాలు ఊపందుకోలేదు. ఈ రైస్‌ మొదటి రకానికి అయి ఉంటాయని చాలా మంది భావించారని, అన్నం వండిన తర్వాత కాస్త దొడ్డుగా ఉంటోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అన్నం రుచిగా ఉంటున్నప్పటికీ సన్నగా ఉం డకపోవడం వల్ల కొంత మంది ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. తెలిసిన వారికి పది కిలోల బ్యాగ్‌లను విక్రయించానని కవాడిగూడలోని ఓ ట్రేడర్‌ తెలిపారు. పది కిలోల బ్యాగ్‌లను 40 వరకు తెచ్చి, అమ్మడానికి తంటాలు పడ్డానని చెప్పారు. రెండోసారి ఎవరూ ఈ బియ్యం తీసుకోలేదన్నారు. కాచిగూడలోని ఓ ట్రేడర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తాను 15 రోజుల నుంచి అమ్మకాలు చేస్తున్నానని, వినియోగదారులకు ముందుగా నమునా బియ్యం చూపించి విక్రయిస్తున్నానని చెప్పారు. మొదట 10 కిలోల బ్యాగులు 200 తెప్పించి, పూర్తిగా విక్రయించానని, రెండో సారి 100 తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో అయిదు వేల క్వింటాళ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు వెయ్యి క్వింటాళ్లను పంపిణీ చేశామని నాఫెడ్‌ అధికారి వినయ్‌కుమార్‌ తెలిపారు.


పంపిణీ కేంద్రాలు..

1. ఏపీ రైస్‌ స్టోర్స్‌, మెట్టుగూడ

2. చంద్రమౌళి ట్రేడర్స్‌, కార్వాన్‌

3. ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌ఆర్‌నగర్‌

4. డింగ్‌డాంగ్‌ సూపర్‌ మార్కెట్‌

5. గౌతమ్‌రైస్‌ డిపో, కాప్రా

6. జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్‌హౌజ్‌

7. మాణిక్య ట్రేడర్స్‌, ఆర్‌కే పురం

8. మురళీ కిరణ్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, పటాన్‌చెరువు

9. ముత్తయ్య గ్రాండ్‌ బజార్‌, శేరిలింగంపల్లి

10. ఖైసర్‌ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌, హైదరాబాద్‌

11. సాయిదీప్‌ సూపర్‌ స్టోర్స్‌, మెదక్‌

12. సిర్వి ట్రేడర్స్‌, బోడుప్పల్‌

13. శంకర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, సికింద్రాబాద్‌

14. శ్రీ గోవిందా ట్రేడర్స్‌, కాచిగూడ

15. శ్రీ వీరభద్ర ట్రేడర్స్‌, కవాడిగూడ

16. శ్రీ అంబ ట్రేడర్స్‌, హైదరాబాద్‌

17. శ్రీ బాలాజీ రైస్‌ డిపో, రాంనగర్‌

18. శ్రీ సాయిబాబా రైస్‌ డిపో, కార్వాన్‌

19. సాయిశివ రైస్‌ ట్రేడర్స్‌, కర్మన్‌ఘాట్‌

20. శ్రీ సాయి ట్రేడర్స్‌, కొత్తపేట

21. శ్రీ ట్రేడర్స్‌, చందానగర్‌

22. ఉజ్వల్‌ ట్రేడర్స్‌, మల్లేపల్లి

23. ఉప్పు రాజయ్య ట్రేడర్స్‌, షాపూర్‌నగర్‌

24. రిలయన్స్‌, దేవరయంజాల్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 10:38 AM