Share News

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:05 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.

Big Breaking: కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ..
MLC Kavitha

Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం. ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలించి.. అక్కడే విచారణ జరుపుతాతరని అధికార వర్గాలు చెబుతున్నారు.

కవిత బెయిల్ పిటీషన్..

కాగా, ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.

విచారణకు సహకరించడం లేదు..

మంగళవారంతో కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందేనని న్యాయస్థానంలో వాదించారు. కవిత విచారణకు సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

కడిగిన ముత్యంలా బయటకొస్తా..

కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టొచ్చన్నారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని అన్నారు. తాతను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్‌గా మారనని అన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలోకి చేరితే.. 2వ నిందితుడికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. మూడో నిందితుడు రూ. 50 కోట్ల ఫండ్స్ బీజేపీకి ఇచ్చారని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 01:22 PM