Share News

Malla Reddy: ‘మేడిగడ్డ’తో ప్రజలు బేజారు!

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:27 PM

ప్రభుత్వానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ తప్ప మరే సబ్జెక్ట్ దొరకడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ..

Malla Reddy: ‘మేడిగడ్డ’తో ప్రజలు బేజారు!

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ తప్ప మరే సబ్జెక్ట్ దొరకడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్‌చాట్‌లో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజూ మేడిగడ్డ.. మేడిగడ్డ.. అని అంటుంటే ప్రజలు బేజారవుతున్నారని తెలిపారు. ఆ ప్రాజెక్ట్‌లో ఏదో లీకేజీ అయిందని, దాన్ని సరిచెయ్యాలని.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అని.. ఆయనకి అప్పగిస్తే సరి చేస్తాడంటూ సలహా ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ అయ్యాయంటూ మల్లారెడ్డి తనదైన స్టైల్లో పేర్కొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 09:05 PM