Share News

KTR: ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్లీ అధికారంలోకి వస్తాం..

ABN , Publish Date - Jan 28 , 2024 | 04:10 PM

24 సంవత్సరాల పాటు నిర్విరామంగా పని చేసిన కారుకు చిన్న సర్వీసింగ్ అవసరం పడదా ?.. అని బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

KTR: ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్లీ అధికారంలోకి వస్తాం..

24 సంవత్సరాల పాటు నిర్విరామంగా పని చేసిన కారుకు చిన్న సర్వీసింగ్ అవసరం పడదా ?.. అని బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎక్కడికీ వెళ్లనని, రాజకీయ జన్మను ఇచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు. పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్న ఆయన.. అధికార పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయన్నారు. మూడు ఫీట్లు కూడా లేనాయన, బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతరపెడతారని మాట్లాడున్నారని మంచి మంచి తీస్మార్ ఖాన్‌లే కేసీఆర్‪ను ఏం చేయలేకపోయారని ఫైర్ అయ్యారు.

మాణిక్యం ఠాగూర్‌కు రూ.యాభై కోట్లు ఇచ్చి, మేనేజ్మెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యారని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగితే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని వివరించారు. ఒకరిద్దరు పోయినా పర్వాలేదన్న ఆయన మళ్లీ కొత్తవారిని తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు.


వినోద్ కుమార్, బండి సంజయ్‌ల పనితీరును పోల్చుకోవాలని కేటీఆర్ ప్రజలను సూచించారు. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప బండి సంజయ్ చేసిందేమి లేదని విమర్శించారు. ఆయన ఇప్పటి వరకు తిరగని మండలాలు కూడా ఉన్నాయని మండిపడ్డారు. ధర్మం కోసం పని చేస్తాం అంటే మఠం పెట్టుకోవాలని సూచించారు. ప్రజల కోసం పనిచేయకుంటే ఓటు అడిగే హక్కు సంజయ్ కు లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీని ఆపే సత్తా కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందని కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 28 , 2024 | 05:46 PM