Share News

Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:06 AM

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.

  Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

మహారాష్ట్ర శంభాజీ పూర్: అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఈ క్రమంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇండోనేషియాలో 80 శాతం ముస్లింలు ఉన్నారని రాజా సింగ్ వివరించారు. మన దేశంలో రూ.500 నోటుపై రాముడి ప్రతిరూపం ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.500 నోటుపై శ్రీరాముడి ఫొటో ముద్రించాలని తన ఒక్కడి డిమాండ్ కాదని, 100 కోట్ల మంది హిందువుల అభిప్రాయమని తెలిపారు. మహారాష్ట్ర శంభాజీపూర్‌లో రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు.

దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను విడుదల చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. దేశ విభజన సమయంలో ఇక్కడి జనాలను హతమార్చిన వారి ఆస్తులను కాపాడేందుకు నెహ్రూ ప్రభుత్వం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు. మహారాష్ట్రలో 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉందని వివరించారు. 2009 వరకు 4 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. అది క్రమంగా 10 లక్షల ఎకరాల వరకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూములను మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాజా సింగ్ కోరారు. లేదంటే కోర్టులో పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 09:16 AM