Home » Ayodhya Prana Prathista
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
అయోధ్య రామ్లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.
శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ( Ayodhya ) పరవశిస్తోంది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.
రాఘవుడు నడయాడిన నేలగా ఖ్యాతి గడించిన అయోధ్యలో బాల రాముడు కొలువయ్యాడు. రామ్ లల్లాను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ట్రస్టు కీలక ప్రకటన చేసింది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.
అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని