Share News

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

ABN , Publish Date - May 01 , 2024 | 01:22 PM

మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

వరంగల్ : మంత్రి కొండా సురేఖ (Konda Surekha) క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కొత్తగా కాంగ్రెస్‌లో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందే అభ్యర్థులు కొట్టుకున్నారు. ఎంత చెప్పిన వినకపోవడంతో కార్యాలయం నుంచి కావ్య వెళ్లిపోయారు. మంత్రి కార్యాలయం రసభాసగా మారింది.

ఇదికూడా చదవండి: Etala Rajender: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప నిధులు లేవు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2024 | 01:22 PM