Share News

IPL 2024: అంపైర్లపై కోహ్లి ఆగ్రహం.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:23 PM

అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.

IPL 2024: అంపైర్లపై కోహ్లి ఆగ్రహం.. ఎందుకంటే..?
Virat Kohli

అంపైర్లపై విరాట్ కోహ్లి (Virat Kohli) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆవేశానికి గురయ్యారు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. దీంతో కోహ్లిలో ఆగ్రహం ఒక్కసారిగా బయటకు వచ్చింది. క్రీజు నుంచి బయటకు వెళ్లే సమయంలో అంపైర్‌తో మాట్లాడుతూ వెళ్లాడు. డగౌట్ వద్ద బ్యాట్‌ను నెలకేసి కొట్టాడు. చైర్స్ ఉన్న వద్ద బిన్‌ను తోసేశాడు. తర్వాత దానిని ఎప్పటిలాగే అక్కడ పెట్టాడు. అంపైర్‌తో వాదన నేపథ్యంలో కోహ్లిపై చర్యలు ఉంటాయో చూడాలి.

IPL 2024: అదరగొట్టిన కోల్ కతా బ్యాట్స్‌మెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 07:23 PM