Share News

Rishabh Pant: చెల్లెమ్మకు పెళ్లంట అన్నయ్యకు సంబరమంట.. రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:18 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. అంకిత్ చౌదరి అనే వ్యక్తితో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతోపాటు స్నేహితులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.

Rishabh Pant: చెల్లెమ్మకు పెళ్లంట అన్నయ్యకు సంబరమంట.. రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. అంకిత్ చౌదరి అనే వ్యక్తితో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతోపాటు స్నేహితులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే పంత్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన విషయాన్ని రిషబ్ పంత్ అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు ‘‘అభినందనలు సిస్’’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో రిషబ్ పంత్ చెల్లి సాక్షికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభిమానులు ‘‘చెల్లెమ్మకు పెళ్లంట అన్నయ్యకు సంబరమంట’’ అని కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి కూడా తన నిశ్చితార్థ వేడుకలకు సంబంధిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు నివేదికల ప్రకారం సాక్షి, అంకిత్ చౌదరి 9 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.


కాగా సరిగ్గా ఏడాది క్రితం రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం కోలుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మార్చి చివరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా కూడా రిషబ్ పంతే వ్యవహరించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఈ నెల చివరలో ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ నుంచే పంత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌లో పంత్ సత్తా చాటితే జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు టీమిండియాలో చోటు దక్కే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 11:18 AM