Share News

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు..

ABN , Publish Date - Feb 09 , 2024 | 04:54 PM

స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరమవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు..

స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరమవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ముంబై విమానాశ్రయంలో రాహుల్ సందడి చేశాడు. విమానాశ్రయంలో పలువురు అభిమానులకు రాహుల్ సెల్పీలు కూడా ఇచ్చాడు. దీంతో రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు తెలుస్తోంది. మూడో టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు త్వరలోనే జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో అప్పుడే మూడో టెస్టులో రాహుల్ ఆడేది లేని దానిపై స్పష్టత రానుంది. కాగా తొలి టెస్టులో చెలరేగిన రాహుల్.. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లు కూడా ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా శ్రేయాస్ అయ్యర్ కూడా గాయపడినట్టు తెలుస్తోంది. అతను కూడా సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కావొచ్చు. అయితే వీటన్నింటిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 04:54 PM