Share News

IND vs ENG: టీమిండియాకు షాక్.. చికిత్స కోసం లండన్‌కు మరో కీలక ప్లేయర్

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:40 PM

గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది.

IND  vs ENG: టీమిండియాకు షాక్.. చికిత్స కోసం లండన్‌కు మరో కీలక ప్లేయర్

గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో భారత జట్టుకు మరో షాక్ తగిలినట్టైంది. అంతేకాకుండా గాయానికి సంబంధించిన చికిత్స కోసం రాహుల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) లండన్‌కు పంపించిందని సమాచారం. ఇప్పటికే టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి లండన్‌లో చికిత్స శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. నిజానికి రాహుల్ ప్రస్తుతానికి 90 శాతం వరకు కోలుకున్నట్టు తెలుస్తోంది. కానీ రాహుల్ ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షించాలని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) నిర్ణయించుకుందని సమాచారం. అయితే భారత జట్టు ఇప్పటికే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడంతో రాహుల్ విషయంలో బీసీసీఐ రిస్కు తీసుకునే ఆలోచనలో లేదట.


ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్ ముగిసిన 10 రోజుల్లోనే ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఆ వెంటనే అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందుకే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు రాహుల్‌కు తగిన విశ్రాంతి ఇవ్వనున్నారని సమాచారం. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత గాయపడిన రాహుల్ మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు రాహుల్‌ను ఎంపిక చేసే సమయంలోనే పూర్తి ఫిట్‌నె స్ సాధిస్తేనే ఆడిస్తామని సెలెక్టర్లు చెప్పారు. కానీ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఇంగ్లండ్‌ను ఓడించి భారత యువ జట్టు టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభంకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 03:40 PM