Share News

Viral Video: లోకల్ ట్రైన్ లో యువతి చిందులు.. అధికారుల దృష్టికి చేరిన వీడియో.. చివరకు

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:03 PM

సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ నెట్టింట్లో దూరిపోయారు. తమకు వచ్చిన ట్యాలెంట్ ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ ఆనందం పొందుతున్నారు.

Viral Video: లోకల్ ట్రైన్ లో యువతి చిందులు.. అధికారుల దృష్టికి చేరిన వీడియో.. చివరకు

సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ నెట్టింట్లో దూరిపోయారు. తమకు వచ్చిన ట్యాలెంట్ ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ ఆనందం పొందుతున్నారు. ఇటీవలి కాలంలో మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, బస్టాండ్లు, మాల్స్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్స్ చేసే పద్ధతి బాగా పెరిగిపోయింది. ట్రెండింగ్ లో ఉన్న పాటలకు డ్యాన్స్ చేయడం, వాటిని వీడియో తీసి పోస్ట్ చేయడం ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. కానీ.. తాము అలా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. చివరకు వారి వీడియో వైరల్ గా మారి అధికారుల దృష్టికి చేరుతున్నాయి. వారు వెంటనే పబ్లిక్ ప్లేస్ లో జనజీవనానికి ఆటంకం కలిగించారంటూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ముంబయిలో చోటు చేసుకుంది.

ముంబయి లోకల్ ట్రైన్‌లో కదులుతున్న రైలు కోచ్‌లో ఓ యువతి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. నల్లటి క్రాప్ టాప్, స్కర్ట్ ధరించిన ఓ మహిళ తన సీటు నుంచి ఒక్కసారిగా లేచి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆమె ట్యాలెంట్ కు చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయినా.. ఆమె వేసుకున్న దుస్తులను చూసి అసహ్యించుకున్నారు.


ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. యువతి చర్య పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అలా రైల్వే అధికారుల దృష్టికి చేరింది ఈ వీడియో. వారు వెంటనే అలర్ట్ అయ్యి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో జనానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 06:03 PM