Share News

YouTuber: యూట్యూబర్‌పై దాడికి తెగబడ్డ బిగ్ బాస్ ఫేమ్ ఎల్విస్ యాదవ్.. ఎందుకంటే.?

ABN , Publish Date - Mar 09 , 2024 | 08:05 AM

బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ మరో వివాదంలో చిక్కాడు. మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్, అతని అనుచరులపై దాడికి తెగబడ్డాడు. గురుగ్రామ్‌‌లో దాడి జరిగిందని, ఆ వీడియోను సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

YouTuber: యూట్యూబర్‌పై దాడికి తెగబడ్డ బిగ్ బాస్ ఫేమ్ ఎల్విస్ యాదవ్.. ఎందుకంటే.?

గురుగ్రామ్: బిగ్ బాస్ (Bigg Boss) ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) మరో వివాదంలో చిక్కాడు. మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్ అలియాస్ మ్యాక్స్‌టర్న్‌పై దాడికి తెగబడ్డాడు. గురుగ్రామ్‌‌లో గల గార్మెంట్ షాపులో దాడి జరిగింది. ఆ వీడియోను సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సాగర్‌పై దాడి చేసిన ఎల్విష్ యాదవ్ (Elvish Yadav), అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడి ఎందుకు జరిగిందంటే..?

మ్యాక్స్ టెర్న్‌కు ఎల్విష్ యాదవ్‌ దాడి చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇటీవల జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఎల్విష్ యాదవ్ పాల్గొన్నారు. గతంలో హిందు దేవతలపై కామెంట్స్ చేసిన మునావర్ ఫారుఖీ పాల్గొన్నాడు. ఫరూఖితో యాదవ్ మాట్లాడటం, వారి మధ్య ఫ్రెండ్ షిప్‌ గురించి సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. ఆ విషయం ఎల్విష్ యాదవ్‌కు తెలిసింది. తన అనుచరులతో కలిసి ఠాకూర్‌‌పై దాడి చేశాడు.

ఎల్విష్ యాదవ్‌ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా దాడులకు తెగబడిన ఘటనలు ఉన్నాయి. ఓ మైనర్‌పై ఎల్విష్ చేయి చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎల్విష్ వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 11:32 AM