PM Modi: నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ సభ
ABN, Publish Date - May 11 , 2024 | 12:56 PM
మహబూబ్ నగర్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. శనివారంతో ప్రచారం నిలిచిపోనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అందులో భాగంగా శుక్రవారం నారాయణపేటలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే సభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు.
1/6
ఎన్నికల ప్రచారంలోభాగంగా శుక్రవారం నారాయణపేటలో బీజేపీ నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.. ఇంకా పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలు..
2/6
బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో బీజేపీ నిర్వహించిన జనసభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ..
3/6
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శాలువ కప్పి సన్మానిస్తున్న మహబూబ్నగర్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ..తదితరులు..
4/6
ఎన్నికల ప్రచారంలోభాగంగా శుక్రవారం నారాయణపేటలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీకి మెమెంటో అందజేస్తున్న బీజేపీ నేతలు..
5/6
నారాయణపేటలోజరిగిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు ప్రజలకు నమస్కరిస్తున్న దృశ్యం.
6/6
మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేటలో బీజేపీ నిర్వహించిన జనసభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
Updated at - May 11 , 2024 | 12:56 PM