Congress: కొండా దంపతులను కలిసిన కడియం శ్రీహరి కుమార్తె కావ్య..
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:51 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న తీరు, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
1/6
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సోమవారం మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చములు అందజేస్తున్న దృశ్యం.
2/6
తన నివాసానికి వచ్చిన కడియం శ్రీహరికి నుదుట బొట్టు పెడుతున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ..
3/6
కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యాలను మంత్రి కొండా సురేఖ దంపతులు నూతన వస్త్రములు పెట్టి సన్మానిస్తున్న దృశ్యం.
4/6
కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యాలకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి మొక్కను అందాజేస్తున్న దృశ్యం.
5/6
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును సోమవారం కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కలిసిన దృశ్యం.
6/6
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కలిసి పుష్పగుచ్చములు అందజేస్తున్న దృశ్యం.
Updated at - Apr 02 , 2024 | 09:51 AM