టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు..

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:04 AM

చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి ఘన విజయం సాధించాయి. ఇప్పుడూ అదే రిపీట్‌ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్‌పై విమర్శలకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సైకో జగన్‌ను తరిమికొట్టేందుకు సిద్ధమా... అని అధినేతలు ప్రశ్నించగా లక్షలాది మంది సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 1/9

చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 2/9

చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని.. సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, టీడీపీ అధినేత, చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇతర నేతలు...

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 3/9

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకరికొకరు పరామర్శించుకుని అభినందించుకుంటున్న దృశ్యం.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 4/9

చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 5/9

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 6/9

చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని.. ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 7/9

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బోపూడి వద్ద ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో జన గర్జన వినిపించింది. సుమారు మూడువందల ఎకరాల ప్రాంగణం... జాతీయ రహదారిపై అటూ ఇటూ దాదాపు 20 కిలోమీటర్లు... ఎటు చూసినా జనం జనం... ప్రభంజనం! టీడీపీ- జనసేన - బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్‌హిట్‌...

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 8/9

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేదికపై ముచ్చటించుకుంటున్న దృశ్యం.

టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం సభ దృశ్యాలు.. 9/9

ప్రధానమంత్రి నరేంద్రమోదీని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భుజంపై మోదీ చేయివేసి ముచ్చటిస్తున్న దృశ్యం.

Updated at - Mar 18 , 2024 | 11:04 AM