Share News

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:18 AM

అసోం పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. సెంట్రల్ కోహురా రేంజ్‌లో గల మిహిముఖ్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ సవారీ చేశారు. తర్వాత అక్కడే జీపులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

గౌహతి: అసోం పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) బిజీగా ఉన్నారు. రెండురోజుల పర్యటన కోసం గౌహతి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ (PM Modi) కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. సెంట్రల్ కోహురా రేంజ్‌లో గల మిహిముఖ్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ (PM Modi) సవారీ చేశారు. తర్వాత అక్కడే జీపులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో (PM Modi) పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

‘మీరు కూడా అసోంలో గల కాజిరంగా నేషనల్ పార్క్ సందర్శించండి. ఇక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి. అసోం ప్రజల ఆహ్వానాన్ని స్వీకరించండి. కాజిరంగ పార్క్‌కు రావడం అంటే అసోం హృదయం, ఆత్మను దర్శించడమే అవుతుంది. లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్‌మ్మయి ఏనుగులకు చెరకు గడ తినిపించాను. కాజిరంగ ఖగ్గ మృగాలకు ఫేమస్. ఎక్కువ సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి అని’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అసోంలో ఈ రోజు, రేపు ప్రధాని మోదీ పర్యటిస్తారు. రూ.18 వేల కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 11:18 AM