Share News

Deve Gowda: ‘కుమార’ పోటీపై బీజేపీదే తుది నిర్ణయం..

ABN , Publish Date - Mar 05 , 2024 | 12:54 PM

లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.

Deve Gowda: ‘కుమార’ పోటీపై బీజేపీదే తుది నిర్ణయం..

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు. పార్టీ కార్యాలయం జేపీ భవన్‌లో రాష్ట్ర మహిళా విభాగం సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో కుమారస్వామి ఢిల్లీ వెళ్తారని వివరించారు. అభ్యర్థులు, నియోజకవర్గాలు అన్నీ ఖరారవుతాయన్నారు. కాగా జయదేవ ఆసుపత్రుల మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఆయనదే నిర్ణయమన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 12:54 PM