Home » HD Kumaraswamy
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు.
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, మండ్య లోక్సభ అభ్యర్థి కుమారస్వామి(Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
‘మిస్టర్ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత, మండ్య లోక్సభ అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్ పెట్టారు.
లోక్సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
కర్ణాటక నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్పై చర్చలు జరిపామని చెప్పారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాతే బీజేపీ-జేడీఎస్(BJP-JDS) మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రానుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఢిల్లీలో మీడియాకు చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తనకు 90 ఏళ్లు అని, వయస్సు పైబడినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.